50 రోజులు పూర్తిచేసుకున్న స‌మ్మ‌ర్‌ బ్లాక్ బస్టర్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్‌ 'సరైనోడు'

  • IndiaGlitz, [Thursday,June 09 2016]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో, సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో, అల్లు అరవింద్ నిర్మాణంలో తెర‌కెక్కిన‌ చిత్రం సరైనోడు చిత్రం జూన్‌ 10వ తేదికి విజ‌య‌వంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంటుంది. స‌రైనోడు చిత్రం స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ ను వసూలు చేస్తూ, ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరిచింది. క‌లెక్ష‌న్ల ప్ర‌కారం టాలీవుడ్ టాప్‌ 5 చిత్రాల్లో స‌రైనోడు చిత్రం చోటు చేసుకుంది. చాలా ఏరియాల్లో సోలోగా నెం1 పోజిష‌న్స్ లో టాప్ టౌన్ రికార్డ్స్ క్రియెట్ చేసింది. 50 రోజులు పూర్తిచేసుకుని 100 రోజుల కి శ‌ర‌వేగంగా దూసుకుపోతుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ... సరైనొడు చిత్రం మా బ్యాన‌ర్‌లో అల్లు అర్జున్‌, ర‌కూల్ ప్రీత్ సింగ్‌,కేథ‌రిన్ కాంబినేష‌న్ లో బోయాపాటి శ్రీను ద‌ర్శ‌కుడిగా నిర్మిచాము. సమ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల చేసిన మా చిత్రం మా అంచ‌నాలు మించి విజ‌యం సాధించింది. ముఖ్యంగా చూసిన ప్ర‌తి ఓక్క‌రు బ‌న్ని ఫెర్‌ఫార్మెన్స్ గురించి మాట్లాడారు. బ‌న్ని చాలా మెచ్యుర్డ్ గా న‌టించాడ‌ని చెప్పారు. దానికి బ‌న్ని చాలా క‌ష్ట‌ప‌డి త‌న బాడీ లాంగ్వెజ్ ని ఈ పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా మ‌లుచుకుని చేశాడు. అలాగే బోయ‌పాటి శ్రీను గారికి మాస్ ప‌ల్స్ బాగా తెలుసు బ‌న్ని ని ఎలా చూపించాలో తెలిసిన వ్య‌క్తి కావ‌టం వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన స‌రైనోడు కి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు. థ‌మ‌న్ అందించిన ఆడియో సినిమాకి ప్ల‌స్ అయ్యింది. ముఖ్యంగా ర‌కూల్ ప్రీత్‌సింగ్‌, కేథ‌రిన్ లు ఇద్ద‌రూ పోటాపోటిగా నటించి మెప్పించారు. అలాగే శ్రీకాంత్‌, జ‌య‌ప్ర‌కాష్‌, సాయికుమార్‌లు స‌పోర్టివ్ పాత్ర‌లో చాలా బాగా చేశారు. బ్ర‌హ్మ‌నందం, అన్న‌పూర్ణ , విద్యులేఖ చేసిన కామెడి మా చిత్రాన్ని ఫ్యామిలి ఆడియ‌న్స్ కి ద‌గ్గ‌ర చేసింది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులని ఆక‌ట్టుకుంది. 50 రోజులు పూర్తిచేసుకుని 100 రోజుల‌కి దూసుకుపోతుంది. ఈ ఘ‌న‌విజ‌యం అందించిన ప్ర‌పంచంలో వున్న తెలుగు ప్రేక్ష‌కుల కి మా హ్రుద‌య పూర్వ‌క ద‌న్య‌వాదాలు.. అని అన్నారు.

More News

నా లైఫ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు బాగా క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా అదే : సందీప్ కిష‌న్

స్నేహ‌గీతం, ప్ర‌స్ధానం, వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్, గుండెల్లో గోదారి, బీరువా, టైగ‌ర్, ర‌న్...ఇలా విభిన్న క‌థా చిత్రాల్లో న‌టించి యువ‌త‌లో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యంగ్ హీరో సందీప్ కిష‌న్. తాజాగా సందీప్ కిష‌న్ న‌టించిన చిత్రం ఒక్క అమ్మాయి త‌ప్ప.

పవన్ ,మహేష్ లతో సినిమా చేస్తున్న డైరెక్టర్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సూపర్ స్టార్ మహేష్...వీరిద్దరితో ఒకేసారి సినిమాలు చేసే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు ఓ డైరెక్టర్.

మిస్టర్ పై క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్..

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్నచిత్రం మిస్టర్.

జూన్ చివరి వారంలో విడుదలకి సిద్దమవుతున్న 'అంతం' ట్రైలర్

గుంటూరు టాకీస్ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రంతో యువత హ్రుదయాల్లో పర్మినెంట్ ప్లేస్ ని సొంతం చేసుకున్న రష్మిగౌతమ్ హీరోయిన్ గా ప్రదాన పాత్రలో నటించిన చిత్రం అంతం.

అప్పుడు బాలయ్య ప్యాన్...ఇప్పుడు పవన్ కల్యాణ్...

నేటి తరం యంగ్ హీరోస్ లో మంచి సక్సెస్ రేట్ ఉన్న హీరో నాని,ప్రతి సినిమాను డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటూ సినిమాలు చేస్తున్న ఈ హీరో