‘సర్కార్ వారి పాట’ ఫస్ట్ సింగిల్ : ‘‘కళావతి’’ సాంగ్ ప్రోమో కేక.. మీరు చూశారా..?

  • IndiaGlitz, [Friday,February 11 2022]

సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'సర్కారు వారి పాట' సినిమాపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవరు వంటి వరుస బ్లాక్ బస్టర్లతో ప్రిన్స్ దూకుడు మీదున్నారు. అలాగే గీతా గోవింద్ వంటి భారీ హిట్‌తో పరశురామ్.. మహేశ్‌తో జత కలవడంతో సర్కారు వారి పాటకు ఎక్కడా లేని హైప్ తెచ్చింది. తొలుత ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావించారు. అయితే 'ఆర్ఆర్ఆర్' , రాధేశ్యామ్ వంటి భారీ సినిమాలు లైన్‌లో వుండటంతో సర్కార్ వారి పాటను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం అన్ని పరిస్థితులు కుదుటపడటంతో సమ్మర్ కనుకగా మే 12న గ్రాండ్‌గా విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టారు. ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సినిమాలో తొలి పాట 'కళావతి...' విడుదల చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ ప్రోమో బయటకొచ్చింది. 36 సెకన్ల నిడివి వున్న ఈ ప్రోమో మహేశ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా, తమన్ స్వరాలు సమకూర్చారు.

మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న సర్కార్ వారి పాటను... మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో సూపర్‌స్టార్ సరసన తొలిసారిగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More News

చీప్ స్టార్.. ‘‘మీకు అరటిపండ్లు తీయడం బాగా వచ్చట’’ : రవితేజపై డైరెక్టర్ రమేశ్ వర్మ భార్య కామెంట్స్

ఎప్పుడూ తన పనేదో తాను చూసుకుని.. వున్నంతసేపు తన ఎనర్జీ, పంచులతో అందరినీ నవ్వించే మాస్ మాహారాజా రవితేజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి.

మోహన్‌బాబు వద్దకు మంత్రి పేర్నినాని.. ఈ కొత్త ట్విస్ట్ ఏంటో, టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుతో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని శుక్రవారం భేటీ అయ్యారు.

గుజరాత్ తీరంలో 11 పాక్ పడవల కలకలం.. బీఎస్ఎఫ్, వాయుసేన సెర్చ్ ఆపరేషన్

గుజరాత్‌లోని అరేబియా తీరంలో పాకిస్తాన్‌కు చెందిన 11 పడవలు భారత జలాల్లోకి ప్రవేశించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఈడీ లేఖతో కలకలం... మళ్లీ తెరపైకి టాలీవుడ్‌కు డ్రగ్స్‌ కేసు, ఈసారి డొంక కదలేనా..?

కొన్నేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

టాలీవుడ్‌కు శుభవార్త .. ఏపీలో అందుబాటులోకి కొత్త టికెట్ ధరలు, త్వరలోనే జీవో

గడిచిన కొన్ని నెలలుగా టాలీవుడ్‌కు - ఏపీ ప్రభుత్వానికి మధ్య నలుగుతున్న టికెట్ ధరల పెంపు, థియేటర్‌ల సమస్యలకు చెక్ పెట్టేందుకు సినీ ప్రముఖులు కీలక ముందడుగు వేశారు.