నైజాంలో సర్దార్ సత్తా...

  • IndiaGlitz, [Monday,February 08 2016]

ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌లో బాహుబ‌లి బిజినెస్‌కు, క‌లెక్ష‌న్స్‌కు ఘ‌న‌మైన రికార్డ్ ఉంది. త‌ర్వాత మ‌హేష్ శ్రీమంతుడుకు మాత్రమే బిజినెస్ క్రేజ్ ఉంది. ఇప్పుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న హ‌వా చూపించ‌డం స్టార్ట్ చేశాడు. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఏప్రిల్ 8న విడుద‌ల‌కు రెడీ అవుతుంది. ఇప్ప‌టి నుండి సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొని ఉన్నాయి. నైజాం ఏరియాలో సినిమా డిస్ట్రిబ్యూష‌న్ హక్కులు తీవ్ర పోటీ నెల‌కొన్న నేప‌థ్యంలో ఇందిర ఫిలింస్ డిస్ట్రిబ్యూష‌న్ వారు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ హ‌క్కుల‌ను 20 కోట్ల రూపాయల‌ను చెల్లించి చేజిక్కించుకున్నార‌ని స‌మాచారం. బాహుబ‌లి త‌ర్వాత డిస్ట్రిబ్యూష‌న్ రేటు ఎక్కువ ప‌లికిన చిత్ర‌మిదే కావ‌డం గ‌మ‌నార్హం.