పవన్ ప్రొడ్యూసర్ కి కోపం వచ్చింది...

  • IndiaGlitz, [Tuesday,December 08 2015]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు. యువ ద‌ర్శ‌కుడు బాబీ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం గుజ‌రాత్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే స‌ర్ధార్ షూటింగ్ అనుకున్నంత వేగంగా జ‌ర‌గ‌డం లేద‌ని...అందుచేత‌నే ప‌వ‌న్ స‌ర్ధార్ టీమ్ పై ఆగ్ర‌హించి గుజ‌రాత్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చేసార‌ని...గ‌త రెండు రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ వార్త‌ల‌పై స‌ర్ధార్ ప్రొడ్యూస‌ర్ శ‌ర‌త్ మ‌రార్ స్పందిస్తూ...స‌ర్ధార్ ను సంక్రాంతికి రిలీజ్ చేయ‌డం లేద‌ని ముందే ప్ర‌క‌టించాం. అలాంటి షూటింగ్ ఫాస్ట్ జ‌ర‌గ‌డం లేద‌ని..అందుకే ప‌వ‌న్ గుజ‌రాత్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చేసార‌ని ఇలాంటి ఆధారాలు లేని వార్త‌లు ఎలా రాస్తారో అర్ధం కావ‌డం లేదు. ప‌వ‌న్ గారికిసంబంధించిన షూటింగ్ పూర్త‌వ్వ‌డం వ‌ల‌న ఆయ‌న హైద‌రాబాద్ వ‌చ్చేసారు. మిగిలిన న‌టీన‌టుల‌పై సీన్స్ షూట్ చేస్తున్నాం. షూటింగ్ అనుకున్న విధంగానే జ‌రుగుతుంది. ప‌వన్ కి కోపం వ‌చ్చింద‌నే వార్త‌ల్లో నిజం లేదు అని ప్ర‌క‌టించారు స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ప్రొడ్యూస‌ర్ శ‌ర‌త్ మ‌రార్.