ప‌వ‌న్ మొండోడు ఎవ‌రి మాట విన‌డంతే..

  • IndiaGlitz, [Thursday,March 31 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన లేటెస్ట్ మూవీ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. జానీ త‌ర్వాత ఈ చిత్రానికి క‌థ - క‌థ‌నం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అందించ‌డం విశేషం. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. స‌ర్ధార్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు కానీ...అప్ప‌టికి స‌ర్ధార్ షూటింగ్ పార్ట్ చేయాల్సింది చాలా ఉంది. అయినా అనుకున్న ప్ర‌కారం ఏప్రిల్ 8న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని రిలీజ్ చేయాల‌ని ప‌వ‌న్ డిసైడ్ అయ్యాడు అంతే... డే అండ్ నైట్ వ‌ర్క్ చేసాడు...తోటి న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల‌తో డే అండ్ నైట్ వ‌ర్క్ చేయించాడు. స్వ‌యంగా ప‌వ‌న్ క‌ళ్యాణే స‌ర్దార్ ఆడియో వేడుక‌లో ఈ సినిమా షూటింగ్ కోసం టీమ్ ని హింసించాను. నేను నిద్ర‌పోలేదు. టీమ్ ని నిద్ర‌పోనివ్వ‌లేదు అన్నారు.

ఆడియో ఫంక్ష‌న్ జ‌రిగే టైంకి ఇంకా రెండు పాట‌ల‌ను చిత్రీక‌రించాలి. నెక్ట్స్ డే స్విట్జ‌ర్లాండ్ వెళ్లి వారం రోజుల్లో రెండు పాట‌ల‌ను పూర్తి చేసారంటే ప‌వ‌న్ ఎంత‌లా ఈ సినిమాకి క‌ష్ట‌ప‌డ్డాడో అర్ధం చేసుకోవ‌చ్చు. ప‌వ‌న్ అక్క‌డ పాట‌ల చిత్రీక‌ర‌ణ పూర్తి చేసాడు. ఇక్క‌డ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేయించాడు. స్విట్జ‌ర్లాండ్ లో చిత్రీక‌రించిన పాట‌ల‌కు సెన్సార్ త్వ‌ర‌లో చేయించ‌నున్నాడు. ఇక్క‌డ ఓ ముఖ్య విష‌యం చెప్పాలి. అన్న‌య్య చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ పెళ్లికి కూడా హాజ‌రు కాకుండా ప‌వ‌న్ షూటింగ్ చేసాడంటే ఈ సినిమా పై ఎంత ప‌ట్టుద‌ల‌గా ఉన్నాడో ఊహించుకోవ‌చ్చు. ప‌వ‌న్ ప‌ట్టుద‌ల గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే...ప‌వ‌న్ మొండోడు ఎవ‌రి మాట విన‌డంతే...ఏదైనా అనుకున్నాడంటే జ‌రిగి తీరాల్సిందే.

More News

ఎన్టీఆర్ సినిమాలో మరో హీరోయిన్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం జనతా గ్యారేజ్.

రెహ్మాన్ కోసం గెస్ట్ గా మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు...జనరల్ గా మాట్లాడడం తక్కువ..మీడియాతో మాట్లాడడం ఇంకా తక్కువ.అలాగే ఫంక్షన్స్ కి వెళ్లడం కూడా తక్కువే అని చెప్పాలి.

బాలయ్య వందో సినిమాకి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్..

నందమూరి నటసింహం బాలకృష్ణ వందో సినిమా గురించి రోజుకో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వస్తుంది.

ఎన‌భై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న చుట్టాల‌బ్బాయి

ఆది, న‌మిత‌, యామిని హీరో, హీరోయిన్లుగా వీర‌భ‌ద్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రాన్నిశ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బ్యాన‌ర్ పై వెంక‌ట్ త‌లారి నిర్మిస్తున్నారు.

స‌ర్ధార్ సెన్సార్ పూర్తి..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - కాజ‌ల్ జంట‌గా న‌టించిన చిత్రం స‌ర్ధార్ గబ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కించారు. ఈ సెన్సేష‌న‌ల్ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను ఈరోజు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాకి యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది.