వెబ్ సిరీస్ ఆలోచ‌న‌ల్లో సందీప్ వంగా..?

తొలి చిత్రం 'అర్జున్ రెడ్డి'తో తెలుగులో భారీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ హీరోగా ఎదిగాడు. త‌ర్వాత సందీప్ త‌న మ‌కాంను ముంబైకి మార్చాడు. తెలుగులో త‌న‌కు డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చిన అర్జున్ రెడ్డి చిత్రాన్నే క‌బీర్ సింగ్ పేరుతో తెర‌కెక్కించి భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. 2019లో విడుద‌లైన బాలీవుడ్ చిత్రాల‌న్నింటిలో క‌బీర్ సింగ్ భారీ విజయాన్ని ద‌క్కించుకుంది. షాహిద్‌క‌పూర్‌కు ఈ సినిమాతో స్టార్ హీరో రేంజ్ ద‌క్కింది. ఈ సినిమా త‌ర్వాత సందీప్ వంగా మ‌రో సినిమాను తెర‌కెక్కించ‌లేదు. అనౌన్స్ చేసిన బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్‌లో సెన్సేష‌న‌ల్ హిట్ అందించినా కూడా స్టార్ హీరోలెవ‌రు ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్ర‌స్తుతం క‌రోనా స‌మ‌యం కూడా సందీప్ త‌దుప‌రి ప్రాజెక్ట్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. దీంతో సందీప్ వంగా ఓ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించాల‌ని ఆలోచ‌న‌లో ఉన్నాడట‌. ఇప్ప‌టికే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశాట్ట‌. ప‌రిస్థితులు కాస్త చ‌క్క బ‌డ‌గానే త‌న వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించడానికి రెడీ అయిపోనున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

More News

మ‌ణిర‌త్నం ‘న‌వ‌ర‌స‌’లో టాలీవుడ్ స్టార్స్‌..?

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్స్‌లో మ‌ణిర‌త్నం పేరు ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది. ఈ ద‌ర్శ‌క నిర్మాత ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించే ప్ర‌య‌త్నాల్లో

రాజ‌మౌళి ‘ఆర్ఆర్ఆర్’ కోసం కొత్త‌గా ఆలోచించాలి:  ఆర్జీవీ

రాజమౌళి క్రియేటివిటీ వల్ల ఆయ‌న పాన్ ఇండియా డైరెక్ట‌ర్ అయ్యారు. అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు.

పండ‌గ పందెంలో నితిన్‌..?

యువ క‌థానాయ‌కుడు నితిన్, కీర్తి సురేశ్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘రంగ్ దే’. ఈ ఏడాది భీష్మ‌తో హిట్ కొట్టిన నితిన్ ఈ వేస‌విలో ‘రంగ్ దే’ చిత్రంతో

ప‌వ‌న్ 27 కోసం మ‌రో టైటిల్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో

ఈటలపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డ తెలంగాణ

ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్‌పై ట్వట్టర్ వేదికగా తెలంగాణకు చెందిన పలు జిల్లాల వాసులు మండిపడ్డారు.