SK30: 'ధమాకా' డైరెక్టర్‌తో సందీప్ కిషన్.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..

  • IndiaGlitz, [Tuesday,March 12 2024]

యువ హీరో సందీప్ కిషన్ ఇటీవల 'ఊరుపేరు భైరవకోన' చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. దీంతో ఇదే సక్సెస్ కొనసాగేందుకు పక్కా ప్లానింగ్‌తో కథలు సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన కెరీర్‌లో ల్యాండ్ మార్క్ అయిన 30వ చిత్రాన్ని హిట్‌ కాంబోలో చేయడానికి సిద్ధమయ్యాడు. 'సినిమా చూపిస్తా మావ', 'ధమాకా' వంటి బ్లాక్ బస్టర్ విజయాలను తీసిన త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ కొత్త చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్‌లను ప్రసన్న కుమార్ బెజవాడ అందిస్తున్నాడు.

వీరిద్దరిది హిట్ కాంబినేషన్. ఇప్పుడు వీరిద్దరు కలిసి సందీప్ కిషన్‌తో చిత్రం చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నాయి. ఇప్పటికే ఈ రెండు సంస్థలు 'సామజవరగమన', 'ఊరు పేరు భైరవకోన' వంటి హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్‌ కొట్టేందుకు రెడీ అయ్యాయి. రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో త్రినాథరావు నక్కిన, ప్రసన్నల మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉండనుందట.

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సిబ్బంది వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. మొత్తానికి సక్సెస్ ఫుల్ కాంబోలో ఈ చిత్రం తెరకెక్కతుండటంతో సినిమాపై మంచి భజ్ ఏర్పడింది. తండ్రి కొడుకు నేపథ్యంలో వినోదాత్మకంగా సాగే ఈ కథను మెగాస్టార్ చిరంజీవితో తీయాలి అనుకున్నారు. తండ్రి పాత్రలో చిరు, కొడుకు పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ నటించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. అయితే ఇద్దరు వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ మూవీ సందీప్ కిషన్ తలుపు తట్టింది. ఇందులో తండ్రి పాత్రలో రావు రమేష్ నటించనున్నాడట. మొత్తానికి ఈ సినిమాతో సందీప్ మరో హిట్ కొట్టడం ఖాయమని ఫిల్మ్ నగర్ టాక్. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

Geethanjali: గీతాంజలి కుటుంబానికి సీఎం జగన్ భరోసా.. రూ.20లక్షల ఆర్థికసాయం ప్రకటన..

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకుందా..?

Vijay Thalapathy: సీఏఏ చట్టం అమలుపై తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తీవ్ర ఆగ్రహం

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

YCP MLC: ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు.. మండలి ఛైర్మన్ కీలక నిర్ణయం..

ఏపీ ఎన్నికలు రంజుగా మారుతున్నాయి. ఎత్తులు పైఎత్తులతో అధికార, విపక్షాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తమను కాదని వెళ్లిన నేతలపై అధికార వైసీపీ గుర్రుగా ఉంది.

మోదీ ఏపీ పర్యటన ఖరారు.. టీడీపీ-బీజేపీ-జనసేన భారీ బహిరంగసభకు హాజరు..

ఏపీలో ఎన్నికల రాజకీయం రంజుగా మారబోతుంది. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా ఎన్నికల బరిలో దిగనున్నాయి. ఇప్పటికే మూడు పార్టీలు పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చేసింది.

Vande Bharat: ఏపీలో రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కేంద్ర రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య మరో వందేభారత్ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించగా.