సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారికి సంబంధించిన సెకండ్ వేవ్ బీభత్సంగా ఉంది. ఒక్కసారిగా కేసుల సంఖ్య దారుణంగా పెరిగిపోతోంది. తిరిగి గతేడాది అక్టోబర్ నాటి రోజులను కరోనా గుర్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ మహమ్మారి బారిన సెలబ్రిటీలు పడుతున్నారు. ఇప్పటికే పలువురు తమకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. తాజాగా భారత్‌ క్రికెట్‌ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని సచిన్ ట్విటర్ వేదికగా స్వయంగా వెల్లడించారు.

తాను స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నానని పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సచిన్ తెలిపారు. ‘‘కరోనా సోకుకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నాను. తాజాగా చేయించుకున్న పరీక్షలో నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. మా ఇంట్లో మిగిలిన అందరికీ నెగిటివ్ వచ్చింది. నేను ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను. నాకు, నాతో పాటు దేశ వ్యాప్తంగా ఎందరికో మద్దతుగా నిలుస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాలనుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి’’ అని సచిన్ ట్వీట్ చేశారు.

More News

దేశంలో విజృంభించిన మహమ్మారి.. 60 వేలకు చేరువలో కేసులు

కొన్ని నెలలుగా కరోనా కేసులు చాలా వరకూ తగ్గిపోయాయి. దాదాపు ఈ ఏడాది ఆరంభం నుంచి కరోనా కేసులు పెద్దగా నమోదవడం లేదు.

‘ఆచార్య’తో కలిసి సిద్ద... సర్‌ప్రైజ్ అదిరిపోయిందిగా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ‘ఆచార్య’ చిత్ర యూనిట్ అభిమానులకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ను అందజేసింది.

‘రంగ్ దే’ తొలిరోజు వసూళ్లివే...

నితిన్‌, కీర్తీ సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘రంగ్‌ దే’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకీ అట్లూరి ఈ సినిమాను రూపొందించారు.

'రంగ్ దే'ను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులంద‌రికీ థాంక్స్‌.. ఈ బ్యాన‌ర్‌లో హ్యాట్రిక్ రావ‌డం హ్యాపీ - నితిన్‌

నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'రంగ్ దే'.

చిత్తూరులో స్కూల్‌నే బార్‌గా మార్చేసిన ‘నీచర్’!

ఆ ఉపాధ్యాయుడి పేరు కోటేశ్వరరావు అలియాస్ శ్రీధర్. పాకాల మండలం కృష్ణాపురం మండల పరిషత్‌ ప్రాథమిక ఏకోపాధ్యాయ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నాడు.