వ‌రద‌ బాధితుల‌కు సంపూ స‌హాయం

  • IndiaGlitz, [Monday,November 30 2015]

చెన్నైలో గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న విప‌రీత‌మైన వ‌ర్షాల వ‌ల్ల ఎంతో మంది నిరాశ్ర‌యులు అయ్యారు. ఈ వ‌ర‌ద‌ల వ‌ల‌న ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్ర‌జ‌ల కోసం ప్ర‌భుత్వం, స్వ‌చ్ఛంద సంస్థ‌లు స‌హాయ చ‌ర్య‌లు ప్రారంభించాయి. చెన్నై ప్ర‌జ‌ల ఇబ్బందులు తెలుసుకున్న త‌మిళ హీరో సూర్య త‌న వంతుగా 25 ల‌క్ష‌లు చెక్‌ను నడిగర్ సంఘం తరపున సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేసిన విష‌యం తెలిసిందే.

ఇక మ‌న బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా స్పందించాడు. చెన్నై వ‌ర్షాల వ‌ల‌న ఇబ్బంది ప‌డిన ప్ర‌జ‌ల స‌హాయార్ధం త‌న వంతుగా 50,000 రూపాయ‌ల‌ను త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి అంద‌చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఏది ఏమైనా...చెన్నై ప్ర‌జ‌ల కోసం సంపూ స‌హాయం చేయ‌డం నిజంగా అభినందించ‌ద‌గ్గ విష‌యం.