బాలల హృదయాల్ని దోచుకున్న హీరో సంపూర్ణేష్ బాబు...

  • IndiaGlitz, [Friday,March 18 2016]

హృదయకాలేయం చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని ఏర్పర్చుకున్నాడు హీరో సంపూర్ణేష్ బాబు. తన దైన పాత్రలతో, వైవిధ్యమైన గెటప్పులతో అలరిస్తున్నాడు. ఓ వైపు హీరోగా... మరో వైపు విభిన్నమైన పాత్రలు చేస్తూ తన కెరీర్ కు బంగారు బాటలు వేసుకుంటున్నాడు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
తెలుగు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా... తనకు వీలైనంతలో సేవ చేస్తూ... తాను సైతం అంటూ ముందువరసలో నిల్చుంటున్నాడు. తాజాగా పాఠశాల విద్యార్థుల మనసుల్ని చూరగొని... వారి ప్రేమకు బానిసయ్యాడు. సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం కొబ్బరి మట్ట అనే ఔట్ అండ్ ఔట్ హిలేరియస్ కామెడీ కమర్షియల్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం వెస్ట్ గోదావరి జిల్లాలోని పాలకొల్లుకు సమీపంలోని అరటికట్ల గ్రామంలో జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడికి దగ్గర్లోని పాఠశాలను సందర్శించాడు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో సరదాగా గడిపాడు. వారి ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూ... రాప్ ర్యాంక్ సాధించే బాలురకు రూ.10,000, బాలికలకు 15,000 ఇస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. చదువు విషయంలో అశ్రద్ధ చూపించొద్దని... బాగా చదువుకొని మీ తల్లితండ్రులకు... దేశానికి సేవ చేయాలని ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు విద్యార్థుల్ని కోరారు.

More News

మాస్ హీరో విశాల్ హీరోగా 'టెంపర్' రీమేక్

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి కమర్షియల్విజయాలతో మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న హీరో విశాల్ హీరోగా తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించి సూపర్ డూపర్ హిట్ అయిన ‘టెంపర్’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు.

సునీల్ న్యూమూవీ టైటిల్...

కమెడియన్ టర్నడ్ సునీల్ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆర్.పి.ఎ క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్.సుదర్శనరెడ్డి నిర్మిస్తున్నారు.

రజనీకాంత్ 'కబాలి' రిలీజ్ డేట్....

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం ‘కబాలి’.

పవర్ స్టార్ ను అవమానించిన హీరో....

తెలుగు ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

'నాయకి' టీజర్ విడుదల

త్రిష ప్రధాన పాత్రధారిగా రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై గోవి దర్శత్వంలో మామిడిపల్లి గిరిధర్,పద్మజ మామిడిపల్లి సంయుక్తంగి నిర్మిస్తున్న చిత్రం నాయకి.