స‌మంత‌.. ఒకే రోజున రెండు చిత్రాలు

  • IndiaGlitz, [Tuesday,May 08 2018]

ఈ వేస‌విలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం ‘రంగస్థలం’. ఇందులో ప‌ల్లెటూరి అమ్మాయి రామలక్ష్మిగా స‌మంత చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే.. ఈ నెల‌లో  రెండు సినిమాలతో సందడి చేయనుంది ఈ బ్యూటీ. అందులో ఒకటి ‘మహానటి’ కాగా.. మరొకటి తమిళ అనువాద చిత్రం ‘అభిమన్యుడు’. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా తమిళంలో ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. ఇక్కడ ఈ నెల‌ 9న విడుదల కానున్న ‘మహానటి’.. తమిళనాడులో ‘నడిగర్ తిలగం’ పేరుతో ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సామ్.. జర్నలిస్ట్  మధురవాణి పాత్రలో నటించారు.

సావిత్రి జీవితాన్ని ప్రేక్షకులకు చెప్పే కీలకమైన పాత్ర ఇది. అలాగే ఇదే రోజున (మే 11న‌) విశాల్, సమంత జంటగా నటించిన ‘ఇరుంబుత్తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) చిత్రం కూడా విడుదల కానుంది. ఈ సినిమాలో డాక్టర్ రతీదేవిగా.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపిస్తున్నారు సామ్. ఇలా ఒకే రోజున రెండు సినిమాలతో తమిళనాడులో సందడి చేయబోతున్న సామ్‌కి ఎటువంటి ఫలితం దక్కుతుందో చూడాలి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కన్నడ చిత్రానికి రీమేక్‌గా తెలుగు, త‌మిళంలో తెరకెక్కుతున్న ‘యు టర్న్’ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నారు సామ్. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా తెర‌పైకి రానుంది.

More News

త‌మ‌న్నా ఆ అవ‌కాశం ద‌క్కించుకుంటే..

‘శ్రీ’ (2005)  చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక తమన్నా.

ఎస్‌.గోపాల్ రెడ్డి త‌న‌యుడు భార్గ‌వ మృతి

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ భార్గవ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ అధినేత ఎస్‌.గోపాల్ రెడ్డి త‌న‌యుడు భార్గ‌వ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు

‘అర్జున్ రెడ్డి’ విజయంతో యూత్ స్టార్‌గా ఎదిగారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ యంగ్ హీరో.

పూరీకి ఈసారైనా కలిసొస్తాడా?

‘నిన్నే పెళ్ళాడతా’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన సంగీత దర్శకుడు సందీప్ చౌతా.

న‌టుడిగా ప్ర‌తి సినిమాకు నేర్చుకుంటూనే ఉన్నాను - ఆకాశ్ పూరి

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌