Samantha :మయోసైటిస్ చికిత్సకు రూ.25 కోట్లు.. ఆ హీరో సాయం చేశారా , సమంత ఏమన్నారంటే ..?

  • IndiaGlitz, [Saturday,August 05 2023]

గత కొంతకాలంగా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంలోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు అగ్ర కథానాయిక సమంత. నాగచైతన్యతో విడాకుల తర్వాత కొన్నాళ్లు సినిమాకు గ్యాప్ ఇచ్చిన సమంత.. ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ అయ్యారు. ఈ క్రమంలో మయోసైటిస్ బారినపడినా మొక్కవోని ధైర్యంతో దానిని అధిగమించారు. గతంలో తాను ఒప్పుకున్న ప్రాజెక్ట్‌లను ఒక్కొక్కొటిగా పూర్తి చేస్తున్నారు. ఈ మధ్య సినిమాలకు బ్రేక్ చెప్పి.. ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో ఆధ్యాత్మిక వాతావరణంలో సేదతీరుతున్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ సమక్షంలో యోగా, ధ్యానం వంటి సాధనలు చేస్తున్నారు.

సామ్ చికిత్సకు స్టార్ హీరో సాయం చేశాడంటూ వార్తలు :

ఈ క్రమంలో సమంతపై సోషల్ మీడియాలో పిచ్చి రాతలు మాత్రం ఆగడం లేదు. మయోసైటిస్ చికిత్స కోసం సమంత ఓ స్టార్ హీరో నుంచి రూ.25 కోట్లు సాయం తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమెకు హెల్ప్ చేసిన ఆ టాలీవుడ్ అగ్ర నటుడు ఎవరు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రకరకాల వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. విషయం పెద్దది అవుతుండటంతో సామ్ స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు.

నా సమస్యను నేనే పరిష్కరించుకోగలను :

మయోసైటిస్‌ చికిత్సకు రూ.25 కోట్లా.. ఎవరు మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు చెబుతున్న దానిలో చాలా తక్కువ మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేస్తున్నందుకు చాలా సంతోషంగా వుందంటూ సామ్ చురకలంటించారు. తన కెరీర్‌లో ఇన్నాళ్లు పనిచేసినందుకు జీతంగా రాళ్లూరప్పలు ఇవ్వలేదని తాను భావిస్తున్నా.. అందుకని నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను అంటూ సమంత క్లారిటీ ఇచ్చారు. మయోసైటిస్ కారణంగా ఎందరో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్యలు తానే పరిష్కరించుకోగలనని, వేరే వాళ్ల నుంచి సాయం పొందాల్సిన అవసరం తనకు లేదంటూ సమంత కుండబద్ధలు కొట్టారు.

More News

Tamilisai Soundararajan:ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం : బిల్లుపై ప్రతిష్టంభన.. ఈ అంశాలపై వివరణ ఇవ్వాలన్న తమిళిసై

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.

RTC :విలీనం బిల్లుకు ఆమోదం తెలపని తమిళిసై.. రోడ్డెక్కిన ఆర్టీసీ కార్మికులు, ప్రజల ఇక్కట్లు

తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీని విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలపకపోవడం కలకలం రేపుతోంది.

YSRCP:చంద్రబాబు పర్యటనలో విధ్వంసం.. రేపు చిత్తూరు జిల్లా పర్యటనకు వైసీపీ పిలుపు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పుంగనూరు పర్యటనలో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్ధితుల నేపథ్యంలో

Minister Peddi Reddy:ప్లాన్ మార్చి పుంగనూర్‌కి .. దాడి కోసమే, ఈ వయసులో ఇవేం పనులు, పిచ్చి పట్టిందా : చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఆగ్రహం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Chandrababu Naidu:నన్ను అడ్డుకుంటే జరిగేది ఇదే : పోలీసులు, వైసీపీ కేడర్‌పై దాడికి చంద్రబాబు ఆదేశాలు.. రెచ్చిపోయన తెలుగు తమ్ముళ్లు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్లు పర్యటనలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.