సేమ్ టు సేమ్ పెంపుడు కుక్కలతో సమంత, అనసూయ..

  • IndiaGlitz, [Wednesday,April 28 2021]

కుక్కలంటే అక్కినేని వారి కోడలు, స్టార్ హీరోయిన్ సమంతకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కినేని నాగార్జున సతీమణి, నటి అక్కినేని అమల.. జంతు ప్రేమికురాలు అన్న విషయం తెలిసిందే. ఆమె బ్లూ క్రాస్ సొసైటీలో పనిచేస్తున్నారు. అక్కినేని వారింటికి పెద్ద కోడలిగా అడుగు పెట్టిన సమంతకు కూడా పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఈ ముద్దుగుమ్మ లాక్‌డౌన్ సమయంలో తన పెంపుడు కుక్కతో తీసుకున్న ఎన్నో ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అసలు ఆమెకు కాలక్షేపం అంతా పెంపుడు కుక్కలతోనే అవుతుందంటే అతిశయోక్తి కాదు.

ప్రస్తుతం సమంత ఇంట్లో రెండు జాతుల కుక్కలు ఉన్నాయి. సామ్‌కు ఆ కుక్కలంటే పిచ్చి. వీటిని అత్యంత ప్రేమగా, అపురూపంగా చూసుకుంటుంది. లాక్‌డౌన్ సమయంలో వీటితో తీసుకున్న ఎన్నో పిక్స్‌ను సమంత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇక సమంత పెంచుకునే కుక్కలా పేర్లు ఏంటో తెలుసా.. హాష్‌, డ్రోగో. ఈ రెండు కుక్కలంటే సమంతకే కాదు.. ఆమె భర్త నాగచైతన్యకు కూడా చాలా ఇష్టం. ఇక యాంకర్ అనసూయకు కూడా జంతు ప్రేమికురాలే.. అనసూయకు తన పెంపుడు కుక్కంటే చాలా ఇష్టం. ఈమె తన ఇంట్లో పక్షుల్ని కూడా పెంచుతుంది. చిలుకతో తీసుకున్న వీడియోలను ఇప్పటికే అనసూయ అభిమానులతో పంచుకుంది. పెంపుడు కుక్కతో సైతం తీసుకున్న ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తాజాగా.. సమంత, అనసూయలు పెంపుడు కుక్కలతో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఇద్దరూ పెంపుడు కుక్కలను ముద్దాడుతున్న ఫోటోలను అభిమానులు తెగ వైరల్ చేస్తున్నాయి. రెండు ఫోటోలు సేమ్ టు సేమ్ ఉన్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇద్దరి పెంపుడు కుక్కలూ ఒకే జాతికి చెందినవిగా కనిపిస్తున్నాయి. అంతే కాదు.. కుక్కల కలర్, అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. ఒక రకంగా ఇద్దరూ ఒకే కుక్కతో ఫోటో తీసుకున్నారా? అన్నట్టుగా ఆ రెండు ఫోటోలు ఉన్నాయి. మొత్తానికి కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ తగ్గిపోయాయి. దీంతో ముద్దుగుమ్మలంతా తిరిగి పెంపుడు కుక్కలతో బిజీ అయిపోయారు.

More News

మెగాస్టార్‌ని ఢీకొట్టబోతున్న స్టైలిష్ స్టార్?

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎవరూ థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయి.

కరోనా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..

కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో ఈ మహమ్మారికి చెక్ పెట్టే కార్యక్రమం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది.

అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభణ కొనసాగిస్తోంది. రోజుకు రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళనకు గురి చేస్తోంది.

దిల్ రాజుకు పవన్ మళ్లీ గ్రీన్ సిగ్నల్.. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని ఏ దర్శక నిర్మాతకు ఉండదు? నిర్మాత దిల్ రాజుకైతే పవన్‌తో సినిమా చేసేందుకు చాలా కాలమే పట్టింది.

మే 3 వరకూ అమెరికా వీసాలకు బ్రేక్..

కరోనా మహమ్మారి తెలంగాణలో విజృంభిస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.