సాక్షి చౌదరి ప్రధాన పాత్రలో యేంటి రాజా యూత్ ఇలా ఉంది...

  • IndiaGlitz, [Friday,December 08 2017]

లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఎమ్వీఎస్ సాయి క్రిష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం యేంటి రాజా యూత్ ఇలా ఉంది. దర్శకుడు ఆది శేష సాయి రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సాక్షి చౌదరి ప్రధాన పాత్ర పోషిస్తుండగా..ఇతర ముఖ్య పాత్రల్లో పర్వీన్ రాజ్, పోసాని కృష్ణ మురళి నటిస్తున్నారు. యువ ప్రేక్షకులకు నచ్చే కథా కథనాలతో సందేశాత్మకంగా ఈ సినిమా ఉండబోతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న యేంటి రాజా యూత్ ఇలా ఉంది చిత్రం ఈ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు నిర్మాత దిల్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా విశేషాలు ఆయనకు వివరించారు. అనంతరం టీజర్ ను విడుదల చేశారు. తర్వాత దర్శకుడు శేష సాయి రెడ్డి మాట్లాడుతూ...ఇదొక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. నేటి సమాజంలో యువత ఆలోచన ధోరణిని ప్రతిబింబిస్తుంది. సాక్షి చౌదరి ముఖ్య పాత్రలో కథ సాగుతుంది. నేటి తరం అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమను ఒక ఆట వస్తువుగా భావిస్తున్నారు.

దీని వల్ల వాళ్ల జీవితాల్లో ఎలాంటి చెడు జరుగుతుందో వినోదాత్మకంగా చూపించాం. అమ్మాయైనా, అబ్బాయైనా జీవితాంతం ఒకరి తోడుగానే ఉండాలని సందేశం ఇచ్చాం. వివాహానంతర సంబంధాలు కుటుంబాలను కూల్చివేస్తున్న నేపథ్యాలు ఈ చిత్ర కథలో ఉంటాయి. త్వరలో ఆడియో కార్యక్రమం జరిపి ఈ నెలాఖరుకు చిత్రం యేంటి రాజా యూత్ ఇలా ఉంది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అన్నారు.

నాగ రాకేష్, ఇంద్ర, సంతోష్, పూజితా, అవంతిక, శ్రావణి, అక్షర, భరణి, అప్పారావు, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - శంకర్, సంగీతం - కిషన్, ఎడిటర్ - నందమూరి హరి, ఆర్ట్ - విజయ్ కృష్ణ, పాటలు - రామ్ పైడిశెట్టి, శ్రీ గణేష్

More News

'హ‌లో' షూటింగ్ పూర్తి

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన చిత్రం 'హలో'. కల్యాణి ప్రియదర్శ‌న్  హీరోయిన్. రమ్యకృష్ణ, జగపతిబాబు, అజయ్ ముఖ్య పాత్రలు పోషించారు.

రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలో రవితేజ ?

వరుస పరాజయాలతో ఉన్న మాస్ మహారాజ్ రవితేజ 'రాజా ది గ్రేట్'తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో రవితేజ తన స్పీడ్ పెంచారు.

అమరావతిలో 'జై సింహా' పాటల వేడుక ?

నటసింహ నందమూరి బాలకృష్ణ 102వ సినిమా ‘జై సింహా’. ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ రూపొందిస్తున్న ఈ మూవీలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మళ్లీ బ్రేక్ ఇస్తున్న ప్రభాస్ ?

తొలి చిత్రం ఈశ్వర్ నుంచి మిర్చి వరకు.. ప్రతి సంవత్సరం కూడా తన చిత్రాలతో సందడి చేస్తూ వచ్చారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

త్రివిక్రమ్ వారి చేతే చెప్పిస్తున్నాడు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో.. కథానాయికల పాత్రలు కేవలం వినోదం కోసం అన్నట్లుగానే ఉంటుంటాయి. ఒక్క నువ్వే నువ్వేలో మినహాయిస్తే.. ప్రతి సినిమాలోనూ ఇదే శైలి కనిపిస్తుంది. ఆయన రాసే ఆ మాటలతో కథానాయికలకు మంచి పేరే వచ్చింది కూడా.