'నేనోరకం' అంటున్న సాయిరామ్ శంకర్

  • IndiaGlitz, [Saturday,March 19 2016]

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొంది. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది . కాగా ఈ చిత్రానికి "నేనోరకం" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.త్వరలో ఈ సినిమా టీజర్ ను విడుదల చెయనున్నారు..

ఈసందర్బంగా ..

సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ.. హీరొగా నా కెరీర్ కు బూస్టప్ నిచ్చె చిత్రమిది. నేనోరకం అనే టైటిల్ ఈ సినిమాకు కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది. మారిన మన తెలుగు సినిమా ట్రెండ్ కు తగ్గట్టు గా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కించబడిందన్నారు..

శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ మధ్య తెలుగు సినీ పరిశ్రమ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి."నేనోరకం" సైతం అదే కొవలో వస్తున్న ట్రెండీ మూవీ. దర్శకుడి కధ, కధనమే ఈ సినిమాకు హైలెట్.నాతో పాటు టీమ్ అందరికి ఈ సినిమా మంచి పేరును తీసుకు వస్తుందన్నారు..

దర్శకుడు మాట్లాడుతూ.. " నేనోరకం" టైటిల్ ఎంత వైవిధ్యంగా ఉందో సినిమా కూడా సరికొత్త ట్రీట్ మెంట్ తో రూపొందించటం జరిగింది. ఎన్నో కాంటెపరరీ ఇష్యూస్ ను టచ్ చేస్తూ ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ ను అందించే చిత్రమిది. ఫీల్గుడ్ లవ్ స్టోరీ ఈ సినిమాకు ప్రదానాకర్షణగా నిలుస్తుందన్నారు.

నిర్మాత మాట్లాడుతూ...ఈ వారం లొనె సినిమా టీజర్ ను ఆవిష్కరించ నున్నాము.అన్ని వర్గాల వారిని అలరించెలా ఈ సినిమా మరియు టైటిల్ ను సిద్దం చేయటం జరిగింది.సినిమా ఔట్పుట్ చూసిన అనంతరం రాధిక శరత్ కుమార్ గారు తమిళ్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చెసెందుకు ఇంట్రెస్ట్ చూపారు. ఈ చిత్ర విజయంపై 100% కాన్ఫిడెన్స్ తో ఉన్నామన్నారు..

రేష్మిమీనన్ కధానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఎం.ఎస్ నారాయణ , ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాద్, పృద్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్ తదితరులు నటిస్తున్నారు

కెమెరా: సిద్దార్ద్.. కూర్పు : కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: మహిత్ నారాయణ్

More News

ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్లోకి 'సరైనోడు' పాటలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా...సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో...సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో...

మలేషియాలో సూర్య...

తమిళ హీరో సూర్య-విక్రమ్ కుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న 24మూవీ రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలసిందే.

నితిన్ ఆ గ్రూప్ లో చేరిపోయాడు

పవన్ కళ్యాణ్, రామ్, ప్రభాస్, సునీల్ ఇలా అందరూ విదేశాల నుండి ఏదో ఒక కారణంతో ఇండియా రావడం ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దడం అనే క్యారెక్టర్స్ పోషించి మెప్పించారు. ఇప్పుడు అదే గ్రూపులో హీరో నితిన్ కూడా చేరిపోయాడు.

నవీన్ విజయకృష్ణ హీరోగా రెండో సినిమా ప్రారంభం

ఎస్.వి.సి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నూతన చిత్రం శనివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. సీనియర్ నరేష్ తనయుడు నవీన్ విజయ కృష్ణ హీరోగా నటిస్తుండగా హైదరాబాద్ కు చెందిన నిత్యా నరేష్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది.

'దండు' పాటలు విడుదల

మంగమూరి శేషగిరి రావు సమర్పణలో యశస్విని ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నీరజ్ శామ్,సాయికుమార్,నేహ సక్సేనా,దిశా ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘దండు’.