Sai Vila: దర్శకుడు బి.గోపాల్ క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన సాయి విలా సినిమాస్ ప్రొడక్షన్ నెం 2

  • IndiaGlitz, [Friday,August 26 2022]

ఒక మధ్య తరగతి ప్రేమజంటకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని మంచి ప్లాన్ తో చేజిక్కుంచుకొని కోటేశ్వరులు ఎలా అయ్యారు? అనేదే ఈ కథ. రావుల గౌరమ్మ సమర్పణలో సాయి విలా సినిమాస్ పతాకంపై కృష్ణ (కమెడియన్ గౌతం రాజు కొడుకు), సుమీత జంటగా అంజన్ చెరుకూరి దర్శకత్వంలో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం 2. కొత్త సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ గారు, రేలంగి నరసింహారావు గారు.గౌతం రాజు, ప్రసన్న కుమార్ గారు, రామ సత్య నారాయణ .డి ఎస్ రావు,ఆర్టిస్ట్ మాదవి గారు. తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం కృష్ణ, సుమీత హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి దర్శకుడు బి. గోపాల్ గారు క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ రామసత్యనారాయణ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు..దర్శకుడు రేలంగి నరసింహారావు గారు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

చిత్ర దర్శకుడు : అశల పల్లకిలో అందరూ ఊగుతూ ఉంటారు.కానీ ఆ ఆశలు తీర్చుకొని ఎలా కోటీశ్వరులు అయ్యారు అనేదే ఈ సినిమా కథ. అయితే రాజమౌళి గారు నిర్మాతలు ఇచ్చిన బడ్జెట్ లో మిగిల్చి ఇవ్వడం అలవాటు. నేను అదే ఫాలో అవుతున్నాను.. నిర్మాతలకు నేను చెప్పిన కథ నచ్చడంతో దర్శకుడిగా ఈ సినిమా చేసే అవకాశం కల్పించారు వారికి.ధన్యవాదాలు. నిర్మాత అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలో తెరకేక్కించడానికి ప్రయత్నిస్తాను అన్నారు.

చిత్ర నిర్మాతలు లక్ష్మణ్ రావు., శ్రీనివాస్ లు మాట్లాడుతూ ...మా అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ డే రోజు మా సినిమాను ప్రారంభించు కోవాలనుకొని ఈ రోజు సినిమా మొదలు పెట్టాము. మా మొదటి సినిమా రుద్రవీణ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ కథ నచ్చడంతో మా రెండవ ప్రాజెక్టు గా ప్రొడక్షన్ నెంబర్ 2 లో ఈ సినిమా తీస్తున్నాము. సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తున్నాము మంచి కథతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ మెప్పు పొందేలా ఉంటుంది అన్నారు.

హీరో కృష్ణ మాట్లాడుతూ.. నా ఐదవ సినిమాకు బి. గోపాల్, రేలంగి నరసింహరవు గారి వంటి లెజెండ్స్ రావడం చాలా సంతోషంగా ఉంది.ఈ చిత్ర నిర్మాతలు నన్ను, దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వారు మా పై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకుంటామని తెలుపుకుంటున్నాను అన్నారు

కమెడియన్ గౌతం రాజు మాట్లాడుతూ.. ,మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మా అబ్బాయి సినిమా ప్రారంభం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత లక్ష్మణ్ డేరింగ్ పర్సన్. తన మెదటి సినిమా రిలీజ్ కాకముందే రెండవ సినిమా మొదలుపెట్టాడు. దర్శకుడు కూడా మంచి కథను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

ప్రముఖ జర్నలిస్ట్ వినాయక్ రావు గారు మాట్లాడుతూ.. గౌతం రాజు గారు తన కొడుకుకు కృష్ణ అనే మంచి పేరు పెట్టాడు. హీరో కృష్ణ మంచి సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ కృష్ణ అంతటి స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

నిర్మాత రామ సత్య నారాయణ.గౌతం రాజు కొడుకు కృష్ణ చేస్తున్న ఈ సినిమా ఐదవ సినిమా.ఇలాగే మంచి సినిమాలు తీస్తూ మంచి నటుడుగా ఎదుగుతూ ఫ్యూచర్ లో కృష్ణ తండ్రి గౌతం రాజు అనే స్థాయికి ఎడుగుతాడనే నమ్మకం ఉందని అన్నారు.చక్కని కథను సెలెక్ట్ చేసుకొని తీస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు మంచి పేరు వస్తుంది అన్నారు

నటుడు డి ఎస్ రావు మాట్లాడుతూ ,.. కమెడీయన్ గా మంచి పేరు తెచ్చుకున్న గౌతం రాజు తనయుడు కృష్ణ హీరోగా మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. హీరో హీరోయిన్ ల జోడీ బాగుంది.నిర్మాత అనుకున్న బడ్జెట్ లో దర్శకుడు సినిమా తియలనీ అలాగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు

హీరోయిన్ సుమీత మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

More News

Charmy Kaur : లైగర్ ఫ్లాప్, ఛార్మీ మీద పగ తీర్చుకుంటోన్న మెగా ఫ్యాన్స్.. మరీ ఈ రేంజ్ ట్రోలింగా..?

యూత్‌లో మంచి క్రేజ్ వున్న విజయ్ దేవరకొండ, ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత మంచి ఊపు మీదున్న పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో

Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీని వీడిన గులాం నబీ ఆజాద్, వెళ్తూ వెళ్తూ రాహుల్‌పై విమర్శలు

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి.

Janasena : 'నా సేన కోసం నా వంతు'ని ప్రారంభించిన నాగబాబు.. యూపీఐ ద్వారా సింపుల్‌గా విరాళాలివ్వొచ్చు

కుల, మతాలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తోన్న జనసేనకు అండగా నిలిచేందుకు 'నా సేన కోసం నా వంతు' కార్యక్రమాన్ని ప్రారంభించారు

Actress Anjali: అంజలి ఆస్తులపై ట్రోలింగ్.. అసలు మ్యాటర్ తెలిస్తే షాకే..

తెలుగు తెరపై తెలుగమ్మాయిలు బొత్తిగా కనిపించని రోజుల్లో ఎంట్రీ ఇచ్చింది రాజోలు పిల్ల అంజలి. తన అందం, అభినయంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

Anthele Katha Anthele: అనంతపురం బ్యాక్ డ్రాప్ లో తనీష్, వికాస్ వశిష్ట ల 'అంతేలే కథ అంతేలే'

అనంతపురం బ్యాక్ డ్రాప్ లో ఎమోషన్ ప్యాక్డ్ మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం "అంతేలే కథ అంతేలే".రిధిమ క్రియేషన్స్ పతాకంపై తనీష్ ,వికాస్ వశిష్ట (సినిమాబండి) సహర్ కృష్ణన్ (హీరోయిన్),