close
Choose your channels

‘రిపబ్లిక్’ టీజర్: ఇంకా ఆ ఫ్యూడల్‌ వ్యవస్థలోనే బతుకుతున్నాం

Monday, April 5, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘రిపబ్లిక్’ టీజర్: ఇంకా ఆ ఫ్యూడల్‌ వ్యవస్థలోనే బతుకుతున్నాం

దేవ్ కట్టా దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా రూపొందుతును్న సినిమా ‘రిపబ్లిక్’. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీస్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జె.భగవాన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాలో సాయితేజ్ సరసన హీరోయిన్‌గా ఐశ్వర్యా రాజేశ్‌ నటిస్తోంది. జగపతిబాబు ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను నేడు(సోమవారం) ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.

‘‘ఈ కాలంలో మన జీవితాల నుంచి రాజకీయాన్ని వేరు చెయ్యలేం!’’ అని చెప్పిన జార్జ్ ఆర్వెల్ వ్యాఖ్యలను చూపిస్తూ టీజర్ స్టార్ట్ అవుతుంది. ‘ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో, అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఆ ఫ్యూడల్‌ వ్యవస్థలోనే బతుకుతున్నాం’ అంటూ సాయి తేజ్‌ ఇచ్చే వాయిస్ ఓవర్ ఆకట్టుకుంది. రాజకీయాలు వాటి నేపథ్యంలో అధికారులు ఎలా కరెప్ట్ అవుతున్నారు అనే అంశాలను హైలైట్ చేస్తూ టీజర్ నడిచింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు. సాయి తేజ్ నటన, రమ్యకృష్ణ ఠీవి టీజర్ ప్రత్యేకతలు. ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.