శ‌ర్వానంద్‌తో మ‌రోసారి సాయిప‌ల్ల‌వి?

  • IndiaGlitz, [Monday,April 16 2018]

యువ కథానాయకుడు శర్వానంద్, టాలెంటెడ్ బ్యూటీ సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పడి పడి లేచె మనసు’. రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని.. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోందీ చిత్రం. ఇటీవల తొలి షెడ్యూల్‌ను కోల్‌క‌తాలో పూర్తి చేశారు. రెండో షెడ్యూల్‌ను నేపాల్‌లోని కాట్మండులో చిత్రీకరించనున్నార‌ని తెలిసింది.

ఇదిలా ఉంటే..  శ్రీవిష్ణు హీరోగా ‘నీది నాది ఒకే కథ’ చిత్రాన్ని రూపొందించి విజయాన్ని అందుకున్న వేణు ఊడుగుల.. అతి త్వ‌ర‌లో త‌న రెండో చిత్రానికి శ్రీ‌కారం చుట్టనున్నారు. ఇందులోనూ శర్వానంద్, సాయిపల్లవి  జంటగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని కూడా ‘పడి పడి లేచె మనసు’ నిర్మాతలు ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి నిర్మించ‌నున్నార‌ని తెలిసింది. కాగా.. ఈ సినిమా 90వ దశకంలో సాగిన నక్సల్స్ తిరుగుబాటు నేపథ్యంలో తెర‌కెక్క‌బోతోంద‌ని సమాచారం. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలు త్వరలో వెల్లడికానున్నాయి.

More News

'నా పేరు సూర్య' చిత్రం షూటింగ్ సెట్లో మెగాస్టార్ చిరంజీవి

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”.

బాల‌య్య‌, క‌ళ్యాణ్ సినిమా ఎప్పుడంటే..

న‌టసింహ నంద‌మూరి బాలకృష్ణ.. ‘జై సింహా’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ వరుస సినిమాలు చేస్తున్నారు.

'నా కథలో నేను' ఫస్ట్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేసిన స్టార్‌ రైటర్‌ వి.విజయేంద్ర ప్రసాద్‌

సాంబశివ హీరోగా సంతోషి శర్మ హీరోయిన్‌గా జి.ఎస్‌.కె. ప్రొడక్షన్‌ పతాకంపై శివ ప్రసాద్‌ గ్రంధే స్వీయ దర్శకత్వంలో

ఏప్రిల్ 17 నుండి రెండవ షెడ్యూల్ లో 'నివాసి'

శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి మంచి చిత్రంలో న‌టించి అంద‌రి హ్రుద‌యాల్లో న‌టుడిగా మంచి స్థానం సంపాయించిన శేఖ‌ర్ వ‌ర్మ హీరోగా,

'శ్రీ‌నివాస క‌ళ్యాణం'తో అయినా బ్రేక్ అవుతుందా?

యువ కథానాయకుడు నితిన్‌కు పాత టైటిల్స్‌పైన మక్కువ ఎక్కువ.