సాయిపల్లవి కల నెరవేరినట్టే

  • IndiaGlitz, [Thursday,December 21 2017]

క‌ల‌లు అంద‌రూ కంటారు. అయితే.. కొన్ని కల‌లు మాత్ర‌మే సాకారం అవుతాయి. ఫిదా గ‌ర్ల్ సాయిప‌ల్ల‌వికి కూడా ఓ క‌ల ఉంది. అది ఇప్పుడు నెర‌వేరింది. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య అంటే సాయిపల్ల‌వికి చాలా అంటే ఇష్టం. ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో.. కాక్క కాక్క (వెంక‌టేష్ ఘ‌ర్ష‌ణ‌కి ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌) సినిమా చూసిన‌ప్ప‌టి నుంచి సూర్య‌కి అభిమానిగా మారిపోయాయ‌ని.. ఆయ‌న‌తో న‌టించే అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నాన‌ని సాయిప‌ల్ల‌వి చెప్పుకొచ్చింది.
క‌ట్ చేస్తే.. ఇప్పుడు సాయి ప‌ల్ల‌వి కల నెర‌వేరిన‌ట్ల‌య్యింది. సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న చిత్రంలో క‌థానాయిక‌గా సాయి ప‌ల్ల‌వి ఎంపికైంది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. 2018 దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.
తొలుత ఈ చిత్రం కోసం ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించింది. అయితే ఏమైందో ఏమో గానీ.. ఇప్పుడా స్థానంలోకి సాయిప‌ల్ల‌వి వ‌చ్చి చేరింది.

More News

సూర్య తో జత కడుతున్న సాయి పల్లవి

సూర్య హీరోగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న తాజా చిత్రం సంకాంతికి ప్రారంభం కానుంది. ఇది సూర్య 36వ సినిమా. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేశారు.

బిల్‌గేట్స్ ప్రశంసలు పొందిన భారతీయ చిత్రం

ఈ మధ్య ఇండియన్ సినిమాల్లో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కంటెంట్ ప్రధానంగా ఉండే సినిమాలు రూపొందుతున్నాయి. అటువంటి సినిమాల్లో అక్షయ్‌కుమార్, భూమి పెడ్నేకర్ నటించిన 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ' ఒకటి.

హాలీవుడ్ సినిమా ఆధారంగా 'హ‌లో'?

అక్కినేని అఖిల్ రీ లాంచ్ మూవీగా తెర‌కెక్కిన చిత్రం హ‌లో. ఇష్క్‌, మ‌నం, 24.. ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న డిఫ‌రెంట్ చిత్రాల ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ ఈ చిత్రాన్ని రూపొందించారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ పాత్ర‌లో షాహిద్‌

అర్జున్ రెడ్డి.. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించిన తెలుగు చిత్ర‌మిది. ఈ చిత్రంతో యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయాడు. ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీగా మారాడు. ఇక ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా కూడా అగ్ర క‌థానాయ‌కుల దృష్టిలో ప‌డ్డాడు.

'దీర్ఝ ఆయుష్మాన్ భవ' టైటిల్ లొగొ విడుదల

వింగ్స్ మూవీ మేక‌ర్స్ బేన‌ర్‌పై కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా  జి.ప్రతిమ ఓ  చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే‌.ఎం.పూర్ణానంద్‌ ఈ చిత్రానికి దర్శకుడు‌. సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతొన్న ఈ చిత్రానికి "దీర్ఘ ఆయుష్మాన్ భవ" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.