మెలోడీ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో సాయిధ‌ర‌మ్‌?

  • IndiaGlitz, [Thursday,October 26 2017]

తొలి ప్రేమ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన ఎ.క‌రుణాక‌ర‌న్‌.. ఆ త‌రువాత వాసు, బాలు, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్షకుల‌కు మ‌రింత చేరువ‌య్యారు. 2014లో వ‌చ్చిన చిన్న‌దానా నీ కోసం త‌రువాత మ‌రో సినిమా చేయ‌ని ఈ ల‌వ్ చిత్రాల స్పెష‌లిస్ట్.. చాన్నాళ్ల త‌రువాత‌ మెగా వారి క‌థానాయ‌కుడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇటీవ‌లే ప్రారంభ‌మైన ఈ సినిమా.. అతి త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించ‌నున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు నిర్మించ‌నున్నారు. కాగా, ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా గోపీసుంద‌ర్ ఫిక్స్ అయ్యార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు, భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, ఊపిరి, ప్రేమమ్‌, నిన్ను కోరి చిత్రాల‌తో మెలోడీ పాట‌ల‌కు చిరునామాగా నిలిచారు గోపీసుంద‌ర్‌. ఎ.క‌రుణాక‌ర‌న్ సినిమాలు మ్యూజిక‌ల్‌గా బాగుంటాయి. కాబ‌ట్టి.. ఈ చిత్రంతోనూ గోపీ మ‌రో హిట్ ఆల్బ‌మ్‌ని అందించే అవ‌కాశం లేక‌పోలేదు.

More News

'డ్రైవర్ రాముడు' గా షకలక శంకర్

డ్రైవర్ రాముడు చిత్రం అనగానే నందమూరి తారక రామారావు గారు మాత్రమే గుర్తుకొస్తారు. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ చిత్రాల్లో డ్రైవర్ రాముడు ఒకటి.

తేజ‌, బాల‌య్య టైటిల్ ఫిక్స్ అయ్యిందా?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ న‌టుడిగా ప్ర‌స్థానం ప్రారంభించి, ముఖ్య‌మంత్రిగా ఎదిగిన వైనాన్ని తేజ త‌న ద‌ర్శ‌క‌త్వంలో చూపించ‌బోతున్నారు.

అనిల్‌కు బ‌న్ని ఛాన్స్‌...

ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ చిత్రాల త‌ర్వాత ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై క్లారిటీ లేదు. కొన్ని రోజుల క్రితం అనిల్ రావిపూడి బాల‌య్య సినిమా మొద‌లవుతుంద‌ని కూడా వార్త‌లు వచ్చాయి.

'ప‌ద్మావ‌తి' సాంగ్ రిలీజ్‌...

సంజ‌య్ లీలా బ‌న్సాలీ మూవీ మేకింగ్ అంటే..గ్రాండియ‌ర్‌గా ఉంటుంది. ఆ విష‌యం ఆయ‌న సినిమాల‌ను చూస్తే ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతుంది. ఇప్పుడు సంజ‌య్ లీలా బ‌న్సాలీ తెర‌కెక్కిస్తోన్న చిత్రం 'ప‌ద్మావ‌తి'.

సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో జీవా కొత్త చిత్రం 'కీ'

'రంగం' సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన హీరో జీవా క‌థానాయ‌కుడిగా సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో రూపొందుతోన్న సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ 'కీ'. నిక్కి గ‌ల్రాని, అనైక సోఠీ హీరోయిన్స్‌గా న‌టించారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సుహాసిని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.