'తిక్క'చూపిస్తాడట...

  • IndiaGlitz, [Wednesday,September 09 2015]

సాయిధరమ్‌తేజ్‌ హీరోగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో కొత్త చిత్రం తిక్క'. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై సి.రోహిణ్‌ కుమార్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లారిస్సా బోనేసి హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం సినిమా రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇందులో హీరో, హీరోయిన్స్ మధ్య కొన్ని కారణాలతో బ్రేక్ అప్ అవుతుంది. మళ్ళీ హీరో తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడనేదే కథ. డిసెంబర్ లో సినిమా షూటింగ్ ని పూర్తి చేసి, జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఫిభ్రవరిలో విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తుంది.

రాజేంద్రప్రసాద్‌, అలీ, రావురమేష్‌, పోసాని, తాగుబోతు రమేష్‌, అజయ్‌, వెన్నె కిషోర్‌, సత్య తదితయి ఇతర తారాగణం. ఈ చిత్రానికి యాక్షన్‌: విలియన్‌ ఓంగ్‌, డైలాగ్స్‌: క్ష్మీ భూపాల్‌, స్టోరీ: షేక్‌ దావూద్‌, ఆర్ట్‌: కిరణ్‌ కుమార్‌, ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస, సినిమాటోగ్రఫీ: వి.ఎస్‌.జ్ఞానశేఖర్‌, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌థమన్‌, కో ప్రొడ్యూసర్‌: కిరణ్‌ రాగినేని, నిర్మాత: సి.రోహిణ్‌ కుమార్‌ రెడ్డి, దర్శకత్వం: సునీల్‌ రెడ్డి.