సాయిధ‌ర‌మ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం

  • IndiaGlitz, [Saturday,August 27 2016]

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా మలినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈరోజు ప్రారంభ‌మైంది. ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తుంది. హీరో సాయిధ‌ర‌మ్ తేజ్, హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ పై చిత్రీక‌రించిన ముహుర్త‌పు స‌న్నివేశానికి డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ క్లాప్ ఇచ్చారు.

విభిన్న క‌థాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ ఫ్యాష‌న్ మ్యాగ‌జైన్ ఎడిట‌ర్ గా క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. కొత్త లుక్ కోసం తేజు ముంబాయి వెళ్లి మేకోవ‌ర్ చేయించుకున్నాడ‌ట‌. ఈరోజు నుంచి ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించారు.