సాయిధరమ్ తేజ్ , కరుణాకరన్ మూవీ అప్ డేట్

  • IndiaGlitz, [Wednesday,February 07 2018]

త‌న తొలి సినిమా తొలిప్రేమ'తో విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు.. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే గుర్తుండిపోయే చిత్రం అందించారు దర్శకుడు కరుణాకరన్. ఇప్పుడు తొలిసారిగా సాయిధరమ్ తేజ్ ను డైరెక్ట్ చేస్తున్నారు కరుణాకరన్. ఇందులో అనుపమ పరమేశ్వరన్ మొదటిసారిగా సాయిధ‌ర‌మ్‌ సరసన నటించనుంది. ఈ లవ్ స్టొరీని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ప్ర‌ముఖ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది.

గోపిసుందర్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రానికి డార్లింగ్ స్వామి మాటలు రాస్తున్నారు. గతంలో కరుణాకరన్ దర్శకత్వంలో తొలిసారిగా నటించిన అల్లు అర్జున్ కూడా హ్యాపీ' సినిమాతో చెప్పుకోద‌గ్గ విజయాన్ని అందుకున్నారు. ఇలా తొలిసారి డైరెక్ట్ చేసిన ఇద్దరు మెగా హీరోలకి ఈ దర్శకుడు విజయాలను అందించారు. ఇప్పుడు సాయి విషయంలో కూడా అది మళ్ళీ రిపీట్ అవుతుందేమో చూడాలి. ఇదిలా వుంటే...వి.వి.వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటిలిజెంట్' మూవీ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

జూన్ తరువాత విజయ్ దేవరకొండ, మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం?

‘పెళ్లిచూపులు’సినిమాతో ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకుని,‘అర్జున్ రెడ్డి’ మూవీతో స్టార్ హీరోగా ఎదిగిపోయారు విజయ్ దేవరకొండ.

'రోషగాడు' తో సందేశాన్ని ఇవ్వనున్న విజయ్ ఆంటోని

పోలీస్ కథల నేపథ్యంలో సాగిన సినిమాలకి విజయాల శాతం ఎక్కువ.

హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో 'అ!'...!

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా అనే నిర్మాణ సంస్థను స్థాపించి..‘అ!’

తారక్ , త్రివిక్రమ్ మూవీ డిటైల్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో

మ‌ల‌యాళ టైటిల్ చెప్పిన బ‌న్ని

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగులోనే కాదు మలయాళంలో కూడా అభిమానులు ఉన్నారు. అందుకే బన్నీ సినిమాలు మలయాళంలో కూడా అనువదింపబడుతూ ఉంటాయి. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' కూడా మలయాళంలో డబ్ కానుంది.