మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్: 35 రోజుల తర్వాత ఇంటికొచ్చిన సాయితేజ్.. డిశ్చార్జ్‌, బర్త్‌డే ఒకేసారి

  • IndiaGlitz, [Friday,October 15 2021]

పండగపూట మెగా అభిమానులకు గుడ్‌న్యూస్ అందింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇన్ని రోజులు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన హీరో సాయిధరమ్‌ తేజ్‌ శుక్రవారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన మేనమామ, మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా నేడు సాయి ధరమ్‌ తేజ్‌ పుట్టిన రోజు కావడం యాదృచ్చికం. ఈ సందర్భంగా సాయి తేజ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

విజయ దశమి పండగ రోజున సాయిధరమ్‌ తేజ్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. సాయి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇటీవల పెను ప్రమాదం నుంచి బయట పడ్డ తేజ్‌కు ఇది పునర్జన్మ’ అత్త, పెద్ద మావయ్య తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.' అని మెగాస్టార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కాగా గత నెల వినాయక చవితి సందర్భంగా సాయి తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మాదాపూర్ దుర్గంచెరువు వద్ద వున్న కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఆయన నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ జారిపోవడంతో సాయితేజ్ కిందపడ్డారు. ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్‌ తలతో పాటు ఛాతీ, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయారు. అనంతరం తొలుత 108 ద్వారా మెడికవర్‌ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆపై మరింత మెరుగైన చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే ఉన్నారు సాయి ధరమ్ తేజ్. 35 రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారు.

More News

దసరాకు 'జీ 5'లో విడుదలైన 'రాజ రాజ చోర'కు హిట్ టాక్

'జీ 5'లో 'రాజ రాజ చోర' విడుదలైన వెంటనే సామాజిక మాధ్యమాల్లో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్లు సునైనా, మేఘా ఆకాష్ నటనను ప్రశంసిస్తూ...

ప్రభాస్ 25లో హీరోయిన్‌గా కరీనా కపూర్..?

పాన్ ఇండియన్ స్టార్‌గా దూసుకెళ్తున్న ప్రభాస్ .. వరుసపెట్టి సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఆయన ఓకే చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే..

బిగ్‌బాస్ 5 తెలుగు: యానీ మాస్టర్ తో ఫైట్.. పిల్లో చాటున ఏడ్చేసిన శ్వేతా, ప్రియా బూతులు

'బిగ్‌ బాస్' 5 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. 'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' అనే కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది.

ప్రెగ్నెన్సీని సీక్రెట్‌గా వుంచిన శ్రీయా..గర్వంగా వుందన్న మంచు లక్ష్మీ

డేటింగ్, పెళ్లి వంటి వాటిని రహస్యంగా వుంచి చిత్ర సీమకు షాకిచ్చిన శ్రీయా.. తల్లయిన విషయాన్ని కూడా అలాగే దాచిపెట్టింది.

'పంచతంత్రం' టీజర్ విడుదల చేసిన టీమ్

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'.