నిరుద్యోగం వ‌ల్లే సినిమాల్లోకి వ‌చ్చా.. సాయిధ‌ర‌మ్‌

  • IndiaGlitz, [Tuesday,October 17 2017]

నిరుద్యోగం వ‌ల్లే సినిమాల్లోకి వ‌చ్చా. వేరే అవ‌కాశం లేక‌పోవ‌డం వ‌ల్లే సినిమా ప‌రిశ్ర‌మ‌ని ఎంచుకున్నానంటూ సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ఆదివారం పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫేస్‌బుక్ లైవ్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టించిన సాయిధ‌ర‌మ్‌.. సినిమాల్లోకి రావ‌డానికి కార‌ణం ఏమిటి? అని అడిగిన ప్ర‌శ్న‌కు పై విధంగా స‌మాధాన‌మిచ్చారు.

అంతేకాకుండా.. ఆయ‌న కొత్త చిత్రాల‌కు సంబంధించి ప‌లు గాసిప్స్‌కి తెర‌దించారు. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో సాయి చేయ‌బోయే చిత్రంలో ఆయ‌న ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నారంటూ ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. ఇదే విష‌యం సాయితో ప్ర‌స్తావిస్తే.. అలాందేమీ లేద‌ని చెప్పుకొచ్చాడు. సింగిల్ రోల్‌లోనే క‌నిపించ‌బోతున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. అలాగే క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోయే సినిమా తొలి ప్రేమ కి రీమేక్ అని కొన్ని గాసిప్స్ వినిపించాయి. అయితే దీనికి కూడా.. అలాంటి క్లాసీ సినిమాలు నేను చేయ‌లేను అని రూమ‌ర్స్‌కి తెర‌దించాడు సాయి.

More News

రాజా ది గ్రేట్ క‌థ ఇదే..

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ తొలిసారిగా అంధుడి పాత్ర‌లో న‌టించిన చిత్రం రాజా ది గ్రేట్‌. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు (బుధ‌వారం) తెర‌పైకి రానుంది.

ప‌వ‌న్ చిత్రంలో..కీర్తి సురేష్ లుక్ అదుర్స్‌

జ‌ల్సా, అత్తారింటికి దారేది త‌రువాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ 25వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తుండ‌గా.. కుష్బూ, బొమ‌న్ ఇరాని కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

ఎం.సి.ఎ ఫ‌స్ట్‌లుక్ ఎప్పుడంటే..

నేచుర‌ల్ స్టార్ నాని, ఫిదా స్టార్ సాయిప‌ల్ల‌వి జంట‌గా ఎం.సి.ఎ పేరుతో ఓ సినిమా తెర‌కెక్క‌తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

న్యూ టాలెంట్‌తో బ‌న్నీ?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌.. కొత్త ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేసిన సంద‌ర్భాలు త‌క్కువ‌నే చెప్పాలి. త‌న రెండో చిత్రం ఆర్య కోసం సుకుమార్ కి ద‌ర్శ‌కుడిగా తొలి ఛాన్స్ ఇచ్చిన ఆయ‌న‌.. ఆ త‌రువాత మ‌ళ్లీ 13 ఏళ్ల త‌రువాత రైట‌ర్ వ‌క్కంతం వంశీకి ద‌ర్శ‌కుడిగా మొద‌టి అవ‌కాశ‌మిచ్చాడు.

కీర్తి సురేష్ 'మహానటి' కొత్త పోస్టర్ విడుదల

చిత్ర కథానాయకి కీర్తిసురేష్ పుట్టినరోజును పురస్కరించుకొని నేడు (అక్టోబర్ 17) "మహానాటి" సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. స్వప్న సినిమా-వైజయంతి మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకుడు.