నిర్మాతగా మారబోతున్న సదా

  • IndiaGlitz, [Friday,April 20 2018]

‘జయం’ చిత్రంతో ఆకట్టుకున్న ఉత్తరాది భామ సదా నిర్మాతగా మారనున్నారా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఆ వివరాల్లోకి వెళితే.. మజిద్ దర్శకత్వంలో సదా కథానాయికగా న‌టిస్తున్న త‌మిళ చిత్రం ‘టార్చ్‌లైట్’. ఓ వేశ్యా జీవితానికి సంబంధించిన కథగా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. కథానాయికా ప్రాధాన్యత ఉన్న ఈ సినిమా కోసం చాలా మంది కథానాయికలను సంప్రదించారంట ద‌ర్శ‌కుడు.

కాకపోతే.. పడుపు వృత్తికి సంబంధించిన కథ కావడంతో కథానాయికలు ఎవరూ ఈ సినిమాలో నటించడానికి ముందుకు రాలేదంట. ఇలాంటి స‌మ‌యంలో సదా  ఈ సినిమాలో నటించడానికి ధైర్యంగా ముందుకొచ్చిందని సమాచారం. అంతేగాకుండా.. దర్శకుడి పనితీరు బాగా నచ్చి.. అతని ద‌ర్శ‌క‌త్వంలో త‌నే నిర్మాత‌గా ఓ చిత్రాన్ని నిర్మించడానికి కూడా సదా ప్లాన్ చేస్తున్నార‌న్న‌ది చెన్నై వ‌ర్గాల స‌మాచారం. కాగా.. ‘టార్చ్‌లైట్’ చిత్రాన్ని తెలుగులోనూ విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

More News

ప‌ల్లెటూరి అమ్మాయిగా...

శ‌ర్వానంద్‌, సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

ప్రభాస్ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ‘సాహో’ సుజీత్ దర్శకత్వంలో

పొలిటికల్‌ టచ్‌తో సాగే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ 'భరత్‌ అనే నేను'- కొరటాల శివ

'శ్రీమంతుడు' వంటి ఇండ్రస్టీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందించిన సూపర్‌స్టార్‌ మహేశ్‌ సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన రెండో చిత్రం 'భరత్‌ అనే నేను'.

పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే కు అరుదైన గౌరవం

పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే కు అరుదైన గౌరవం

వరుణ్ తేజ్ - సంకల్ప రెడ్డి క్రేజీ కాంబినేషన్ సినిమా ప్రారంభం

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న వరుణ్ తేజ్ కథానాయకుడిగా "ఘాజీ"