శాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • IndiaGlitz, [Thursday,July 23 2020]

సునిశిత్ స్టార్ తెలుసా? అంటే పెద్దగా ఎవరికీ తెలియదు కానీ శాక్రిఫైసింగ్ స్టార్ అంటే మాత్రం తెలియని వారుండరు. సునిశిత్‌కి నెటిజన్లు ఇచ్చిన బిరుదు అది. మనోడు చేసిన త్యాగాలు ఆ రేంజ్‌లో ఉన్నాయి మరి. ‘వన్ - నేనొక్కడినే’ సినిమా తాను చేయాల్సిందేనని మహేష్ బాబు కోసం శాక్రిఫైస్ చేశానని తెలిపాడు. ఆయన త్యాగం చేసిన లిస్టులో ఒక్క మహేషే కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రవితేజ తదితరులున్నారు. అంతటితో ఆగాడా.. హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నానని.. మరో హీరోయిన్‌తో ప్రేమాయణం నడిపానని.. రచ్చ రచ్చ చేశాడు. కరోనా ప్రారంభానికి ముందు యూట్యూబ్‌లో సునిశిత్ చేసిన రచ్చ ప్రేక్షకుల్ని చాలా ఎంటర్‌టైన్ చేసింది. పోను పోనూ విసుగు కూడా తెప్పించింది.

అయితే సునిశిత్‌పై గతంలో లావణ్య త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లావణ్యను తాను పెళ్లి చేసుకున్నానని.. ఆ తరువాత విడిపోయామంటూ సునిశిత్ చేసిన వ్యాఖ్యలపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే విసుగు చెందిన మరికొందరు కూడా సునిశిత్‌పై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సునిశిత్‌పై రాచకొండ కమిషనరేట్‌లో రెండు కేసులు, ఇబ్రహీంపట్నం కీసరలో ఒక కేసు నమోదైంది. విచారణ నిర్వహించిన పోలీసులు తాజాగా సునిశిత్‌ని అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు.

More News

షాకింగ్.. ఏపీలో ఇవాళ ఒక్కరోజే 7998 కేసులు

ఏపీలో షాకింగ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఏపీకి సంబంధించిన కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

పూరి ఆకాష్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్స్..

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్‌ని నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.

అప్పటి వరకూ నేలపైనే పడుకుంటా: పవన్

ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్‌లోనే ఉండిపోయారు. చాతుర్మాస దీక్ష గురించి..

ప్రతిపక్షంలో ఉన్నామని కాకుండా.. నిష్పక్షపాతంగా మాట్లాడాలి: పవన్

ఏపీలో కరోనా పరిస్థితి.. ప్రభుత్వం విఫలమైందంటూ వస్తున్న వార్తలపై పవన్ స్పందించారు.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్.. త్వరలోనే వైసీపీలోకి గంటా?

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారనున్నట్టు తెలుస్తోంది. ఆయన వైసీపీలోకి త్వరలోనే జంప్ చేయనున్నట్టు సమాచారం.