‘బాహుబలి’ కంటే ముందే ‘సాహో’ ప్లాన్ చేశా కానీ...!!

  • IndiaGlitz, [Friday,August 02 2019]

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘సాహో’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ‘బాహుబలి’ రికార్డ్స్‌ను బ్రేక్ హిస్టరీ క్రియేట్ చేసేంతలా రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం వస్తుండటంతో అభిమానులు, నటీనటులు, సినీ ప్రియుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలచేసిన ఫస్ట్ లుక్, సాంగ్స్‌ కిరాక్ అనిపిస్తున్నాయి. ఆగస్టు 30న ‘సాహో’ను థియేటర్లలోకి తీసుకొస్తోంద చిత్రబృందం. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ వైపు సోషల్ మీడియాలో మరోవైపు మీడియా ద్వారా ఇంటర్వ్యూలతో సినిమా యూనిట్ హడావుడి చేస్తోంది. తాజాగా.. ‘సాహో’ డైరెక్టర్ సుజీత్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాతో పాటు ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

బాహుబలి కంటే ముందే ప్లాన్!

‘బాహుబలి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన సంగతి తెలిసిందే. తెలుగోడి సత్తా చాటి టాలీవుడ్‌కు బాహుబలి సినిమా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా కంటే యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌కు ‘సాహో’ కథ చెప్పానని దర్శకుడు సుజీత్‌ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపారు. ఈ సినిమా ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటుందని.. ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు.

చాలా సవాళ్లు ఎదుర్కొన్నా..!

రెబల్ స్టార్ ప్రభాస్‌ అంటే నాకు చాలా ఇష్టం. ప్రభాస్‌కు తగ్గట్టే కథను నేను సిద్ధం చేశానన్నారు. డైరెక్టర్‌గా నేను చాలా సవాళ్లను ఎదుర్కొన్నానని.. సాహో సినిమాలో ప్రతీ పాట ప్రత్యేకంగా ఉండాలనుకున్నామని అందుకే ఇలా ఒక్కోసాంగ్‌ను రిలీజ్ చేస్తున్నామన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ‘సాహో’ చిత్ర బృందం మొత్తం చాలా కష్టపడ్డామని సుజీత్ తెలిపారు.

ప్రభాస్‌ను హీరోగా ఎవరూ ఎంచుకోలేరు..!

ప్రభాస్‌ను హీరోగా ఎవరూ ఎంచుకోలేరు. ఆయన దర్శకుడ్ని ఎంచుకోవాల్సిందే.. (నవ్వుతూ). ‘సాహో’ కథ నచ్చడం వల్లే నా డైరెక్షన్‌లో నటించడానికి ఆయన ఒప్పుకున్నారని అనుకుంటున్నాను. ‘బాహుబలి’ కంటే ముందే ప్రభాస్‌కు ‘సాహో’ కథ చెప్పాను. ‘బాహుబలి’ వల్ల ఈ సినిమా కథలో ఎలాంటి మార్పులు చేయలేదు అని సుజీత్ మీడియాకు వివరించారు.

కాగా ‘సాహో’లో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్‌ నటిస్తుండగా.. నీల్‌ నితిన్‌ ముకేష్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాగా త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి ఆడియో రిలీజ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లు షురూ కానున్నాయి. మొత్తానికి చూస్తే కొన్నేళ్ల పాటు ప్రభాస్ కోసం కథను అలాగే పెట్టుకున్న సుజీత్ ఈ నెల 30 అభిమానులు, సినీ ప్రియుల ముందుకు తీసుకొస్తున్నారు. మరి సినీ ప్రియులు ఏ మాత్రం హిట్ చేస్తారో వేచి చూడాల్సిందే మరి.

More News

‘యాత్ర’ డైరెక్టర్ కొత్త సినిమా.. నిర్మాతగా పీవీపీ

‘ఆనందో బ్రహ్మ’ సినిమా కామెడీ పండించి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌ ‘యాత్ర’ ఎమోషనల్‌గా టచ్ చేసిన మహి వి. రాఘవ్.. ఈ సారి ఏకంగా ‘సిండికేట్’ సినిమాతో వచ్చేస్తున్నారు.

'మిస్టర్‌ కిల్లర్‌' టీజర్‌ను విడుదల చేసిన అల్లరి నరేష్‌

రమేష్‌ స్టూడియోస్‌, శ్రీనిక్షిత ప్రొడక్షన్స్‌ పతాకాలపై చార్లెస్‌ దర్శకత్వంలో రమేష్‌బాబు ధూళిపాళ, శ్రీకృష్ణ శ్రవణ్‌ తుమ్మలపల్లి నిర్మిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'మిస్టర్‌ కిల్లర్‌'. విశ్వ

ఉగ్రవాదంపై ఉక్కుపాదమే.. కీలక బిల్లుకు పెద్దలు ఆమోదం

ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో భాగంగా దాయాదీ దేశాలను గజగజ వణికిస్తున్నప్పటికీ ఉగ్రమూకలు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు.

మెగాస్టార్ చిరు గురువు దేవదాస్ ఇకలేరు

టాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల తుదిశ్వాస విడిచారు. శుక్రవారం సాయంత్రం తన స్వగృహంలో ఆయన కన్నుమూశారు. కాగా ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.

అలీ విలన్‌.. తమన్నా హీరోయిన్‌.. రచ్చ రచ్చేగా!

టైటిల్ చూసి ఇదేంటి అలీని తమన్నా చీకొట్టడమేంటని అనుకుంటున్నారా..? అదేనండి ఇదంతా మీరు అనుకుంటున్నట్లుగా కమెడియన్ అలీ.. హీరోయిన్ తమన్నా గురించి కాదండోయ్..