సాహో.. బ‌డ్జెట్ పెరుగుతోందా?

  • IndiaGlitz, [Thursday,May 03 2018]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యు.వి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, త‌మిళ‌, హిందీ భాషల్లో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం దుబాయ్‌లోని అబుధాబిలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సన్నివేశాలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని ఇది వరకే చిత్ర బృందం ప్రకటించింది. అన్నట్టుగానే ఈ సీన్స్‌ను ఎక్కడా రాజీ పడకుండా షూట్ చేస్తున్నారు.

అయితే.. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ సన్నివేశాలను చిత్రీకరించేందుకు   దాదాపు రూ.90 కోట్లు వరకు ఖర్చు పెడుతున్నార‌ని తెలిసింది. దాంతో ఈ మూవీ బడ్జెట్ రూ.300 కోట్లకు చేరుకునే అవ‌కాశముంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. అయితే.. తెలుగు, హిందీ, త‌మిళ‌ భాషల్లో ఈ సినిమా విడుదల కానుండడంతో పాటు.. ప్రభాస్ క్రేజ్ కూడా ఈ సినిమాకి ప్లస్ అవుతుందని నిర్మాతలు భావిస్తుండడంతో.. బడ్జెట్ విషయంలో రాజీ పడటం లేదని తెలుస్తోంది. కాగా.. వచ్చే ఏడాది ప్రథ‌మార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

మే 6న ఫాస్‌ ఫిలిం సొసైటీ - దాసరి సినీ అవార్డుల పద్రానోత్సవం

దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సేవలందిస్తున్న ఫిలిం ఎనాలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ(ఫాస్‌)

ఒకే చిత్రానికి ఇద్దరు దర్శకులు!! 

మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ లో 'మల్లె పువ్వు', 'మెంటల్ కృష్ణ', నంది అవార్డు పొందిన 'కలవరమాయే మదిలో' వంటి మంచి చిత్రాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల కొన్నాళ్లుగా నిర్మాతల

రామ్ చ‌ర‌ణ్ సినిమాకి అవేమీ టైటిల్స్ కాద‌ట‌

రంగ‌స్థ‌లంతో చాలా కాలం త‌రువాత బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.

'భరత్ అనే నేను'.. మే 4 నుంచి 'హోలీ' ఫైటింగ్ సీన్

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కియారా అద్వాని జంటగా నటించిన చిత్రం ‘భరత్ అనే నేను’.

నెల‌కో సినిమాతో గోపీసుంద‌ర్‌

‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి క్లాసిక్ ఫిల్మ్‌తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు సంగీత దర్శకుడు గోపి సుందర్.