సందీప్ కిషన్ 'రన్' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Monday,March 21 2016]

కెరీర్ తొలి నాళ్ళ నుండి డిఫరెంట్ మూవీస్ లో నటిస్తున్న హీరో సందీప్ కిషన్ హీరోగా, అనీషా అంబ్రోస్ హీరోయిన్ గా ఏ టీవీ రామబ్రహ్మం సుంకర సమర్పణలో సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర నిర్మాతలుగా మిష్టర్ నూకయ్య ఫేమ్ అని కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం రన్'. విడుదలైన సినిమా ఫస్ట్ లుక్, టీజర్, కాన్సెప్ట్ ట్రైలర్, పాటలకు ఆడియెన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. సినిమా ఎలా ఉంటుందోనని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంలో సంజు అనే పాత్ర సందీప్ కిషన్, అమ్ము పాత్రలో అనీషా అంబ్రోస్, వడ్డీ రాజా పాత్రలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహా నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్స్ లో టైమ్ వల్ల ఎలాంటి మలుపులు తిరిగాయనే కథాంశాన్ని దర్శకుడు అని కన్నెగంటి చాలా టైట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించారు. అన్ కాంప్రమైజింగ్ నిర్మాతలు సినిమాను అద్భుతంగా రూపొందించారు. సినిమా ప్ర‌స్తుతం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది. హోలి సంద‌ర్భంగా మార్చి 23న విడుదల గ్రాండ్ లెవ‌ల్ లో విడుద‌ల చేస్తున్నారు.

ఈ చిత్రానికి డైలాగ్స్: ప్రవీణ్, చీఫ్ కో డైరెక్టర్: సాయి దాసం, ఫైట్స్: విజయ్, కొరియోగ్రఫీ: రాజు సుందరం,సినిమాటోగ్రఫీ: బి.రాజశేఖర్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, మ్యూజిక్: సాయికార్తీక్, నిర్మాత: సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర; దర్శకత్వం: అని కన్నెగంటి.

More News

నిర్మలా కాన్వెంట్ తర్వాత రోషన్ సినిమాలు చేయడంటున్నహీరో శ్రీకాంత్...

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నిర్మలా కాన్వెంట్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

స‌ర్ధార్ వేదిక పై చిరు సినిమా ప్ర‌క‌ట‌న‌..

స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో వేడుక‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన చిరంజీవి ప‌నిలోపనిగా ఇదే వేదిక‌ పై త‌న సినిమా గురించి కూడా ఓ ప్ర‌క‌ట‌న చేసేసారు. ఇంత‌కీ...చిరు త‌న సినిమా గురించి ఏ ప్ర‌క‌ట‌న చేసార‌ని తెగ ఆలోచిస్తున్నారా..? త‌మిళ్ మూవీ క‌త్తి రీమేక్ లో చిరు న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

నాటకాల్లోకి రజనీకాంత్..

ఎవరైనా నాటక రంగం నుండి సినిమా రంగంలోకి రావాలనుకుంటారు. మరి కొంత మంది రెండింటిని సమానంగా హ్యండిల్ చేస్తుంటారు. అయితే సినిమా రంగంలో సూపర్ స్టార్ వెలుగుగొందుతోన్న రజనీకాంత్ నాటకంలో నటించబోతున్నాడు. ఇదేంటని అనుకుంటున్నారా..

త్రివిక్ర‌మ్ కి కూడా ప‌వ‌న్ చెప్ప‌లేద‌ట‌..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఇద్ద‌రూ మంచి మిత్రులు. వీరిద్ద‌రు క‌ల‌సి జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు చేసారు. ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ మ‌ధ్య సాన్నిహిత్యం మ‌రింత పెరిగింద‌నే విష‌యం అందరికీ తెలిసిందే.

ఏప్రిల్ 1న విడుదలవుతున్న పిడుగు

వినీత్‌, మోనికా సింగ్ హీరో హీరోయిన్లుగా వి2 ఫిల్మ్స్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై రామ‌మోహ‌న్.సి.హెచ్ ద‌ర్శ‌క‌త్వంలో అశోక్ గోటి నిర్మించిన చిత్రం 'పిడుగు'. ఈ చిత్రం ద్వారా నిర్మాత అశోక్ గోటి త‌న త‌న‌యుడు వినీత్‌ను హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు.