ఆస్కార్ రేసులో 'రుద్ర‌మ‌దేవి'

  • IndiaGlitz, [Thursday,August 11 2016]

అనుష్క టైటిల్ పాత్ర‌లో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత‌గా గుణా టీం వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన హిస్టారిక‌ల్ త్రీడీ చిత్రం రుద్ర‌మ‌దేవి. ఈ చిత్రంలో గోన‌గ‌న్నారెడ్డిగా అల్లుఅర్జున్‌, చాళుక్య వీర‌భద్రుడుగా రానా న‌టించారు. భారీ తారాగ‌ణంతో పాటు, భారీ టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రం మంచి ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ప్ర‌తాప‌రుద్రుడు చిత్రాన్ని రూపొందిస్తాన‌ని కూడా గుణ‌శేఖ‌ర్ తెలియ‌జేశాడు.

కాగా తాజా స‌మాచారం ప్రకారం ఈ హిస్టారిక‌ల్ చిత్రాన్ని ఫిలిం ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం కేట‌గిరీ క్రింద ఆస్కార్ అవార్డుల‌కు పంపింది. ఈ విష‌యాన్ని గుణ‌శేఖ‌ర్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియజేసి త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేసుకున్నారు.

More News

భారీ రేటుకు 'మ‌నమంతా' శాటిలైట్ హ‌క్కులు

మోహ‌న్ లాల్‌, గౌత‌మి కీల‌క పాత్ర‌ల్లో విశ్వాంత్‌, రైనారావులు తారాగ‌ణంగా విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై సాయికొర్ర‌పాటి నిర్మించిన చిత్రం మ‌నమంతా. ఇటు ప్రేక్ష‌కులే కాదు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న చిత్రంగా నిలిచింది.

రాజ‌శేఖ‌ర్‌తో క‌మ‌ల్ హీరోయిన్‌

గ‌డ్డం గ్యాంగ్ త‌ర్వాత డా.రాజ‌శేఖ‌ర్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పోలీస్ ఆఫీస‌ర్ పాత్రలో న‌టించ‌నున్నాడు.

'ల‌క్కున్నోడు' గా మంచు విష్ణు

ఈడోర‌కం ఆడోర‌కం స‌క్సెస్ త‌ర్వాత మంచు విష్ణు కామెడి ఎంట‌ర్ టైన‌ర్స్ నే చేయాల‌నుకుంటున్నాడట. అందుక‌నే త‌ను వింటున్న క‌థ‌ల్లో కామెడి ఉండాల‌ని చెబుతున్నాడ‌ని స‌మాచారం. ఈడోర‌కం ఆడోర‌కం త‌ర్వాత మ‌రే విష్ణు సినిమా సెట్స్‌లో లేదు.

3 పండ‌గ‌ల‌కు 3 సినిమాలు రెడీ చేస్తున్న దిల్ రాజు

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు స్పీడు పెంచి వ‌రుస‌గా సినిమాలు రెడీ చేస్తున్నారు. 3 పండ‌గ‌లకు 3 సినిమాల‌ను రిలీజ్ చేసేలా ప‌క్కా ప్లాన్ రెడీ చేసారు. ఇంత‌కీ ఆ మూడు పండుగ‌లు ఏమిటి..? ఆ మూడు సినిమాలు ఏమిటి అనుకుంటున్నారా..?

రోజుకో పోస్ట‌ర్ తో ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేస్తున్నజ‌న‌తా గ్యారేజ్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది.