100 కోట్లు పరువు నష్టం దావా..

  • IndiaGlitz, [Monday,July 31 2017]

క‌మ‌ల్ సినిమా రంగం నుండి రాజ‌కీయాల వైపు అడుగులేయ‌డానికి సిద్ధ‌ప‌డ‌గానే ఆయ‌న‌పై రాజ‌కీయ నాయ‌కుల విమ‌ర్శ‌లు ఎక్కువైయ్యాయి. అందుకు బిగ్‌బాస్‌ను వేదిక‌గా చేసుకుంటున్నారు. రియాలిటీ షో బిగ్‌బాస్ త‌మిళ వెర్ష‌న్‌కు క‌మ‌ల్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ రియాలిటీ షో త‌మిళ సంస్కృతిని దెబ్బ‌తీసేలా ఉంద‌ని ప‌లువురు విమ‌ర్శ‌లు చేశారు.
పుదియ త‌మిళ‌గం నేత కృష్ణ‌స్వామి బిగ్‌బాస్ ఏపిసోడ్‌లో గాయ‌త్రి ర‌ఘురాం మ‌రో న‌టి గురించి మాట్లాడుతూ మురికివాడ‌ల్లో నివ‌సించేదానిలా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని కామెంట్ చేసింది. దీనిపై కృష్ణ‌స్వామి గాయ‌త్రి ర‌ఘురామ్, క‌మ‌ల్ త‌దిత‌రులపై 100 కోట్లు ప‌రువు న‌ష్టం దావా వేశారు. మురికివాడ‌ల్లో నివ‌సించే ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా బిగ్‌బాస్ షోలో వ్యాఖ్య‌లు జ‌రిగాయ‌ని, దీనికి క‌మ‌ల్ క్ష‌మాప‌ణ చెప్పాలని, లేకుంటే ప‌రువు న‌ష్టం కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని కృష్ణ‌స్వామి తెలిపారు.

More News

ఆగస్ట్ లో విడుదలకు సిద్ధమవుతోన్న 'తారామణి'

అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `తారామణి`. రామ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్పై డి.వి.వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఆ సలహా నా జీవితాన్ని మలుపుతిప్పంది.

సినిమా బ్యాక్డ్రాప్లో సాగే అందమైన ప్రేమకథ ఇది. ఓ దర్శకుడికి, ఫ్యాషన్డిజైనర్ మధ్య మొదలైన ప్రేమ చివరకు ఏ మజిలీకి చేరుకుందనేది చిత్ర ఇతివృత్తం అని అన్నారు అశోక్.

తెలుగుతో పాటూ..తమిళ, కన్నడ భాషల్లోనూ హవా కొనసాగిస్తున్న కాళకేయ ప్రభాకర్

మర్యాద రామన్న సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రభాకర్,

మరోసారి లక్ పరీక్షించుకుంటున్న హీరోయిన్...

బాలనటిగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించిన షామిలి అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా జెమిని కిరణ్

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి(తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్) అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత పర్వతనేని కిరణ్(జెమిని కిరణ్) ఎంపికయ్యారు.