ఆర్ఆర్ఆర్‌కు సీక్వెల్ .. కన్ఫర్మ్ చేసిన విజయేంద్ర ప్రసాద్, అంతా ఓకే మరి ముగ్గురికీ డేట్స్ కుదిరేదెప్పుడు..?

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, చరణ్‌ల నటనకు తోడు జక్కన్న టేకింగ్‌కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే సినిమా చూసిన వారంతా సీక్వెల్ వుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

'బాహుబలి'ని రెండు భాగాలుగా తీసిన రాజమౌళి, 'RRR'ను రెండు భాగాలుగా తెరకెక్కించలేదు. అయితే... రామ్, భీమ్ పాత్రలతో సీక్వెల్ తీస్తే బావుంటుందనే కోరిక చాలా మందిలో ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ సైతం సీక్వెల్ గురించి రాజమౌళిని అడిగారు. దీనికి సంబంధించిన వివరాలను రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

ఆయన ఏమన్నారంటే.. ‘‘ ఒక రోజు ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చారు. నేనూ, రాజమౌళి ఇద్దరం ఉన్నాం. మాటల సందర్భంలో 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ తీసే వీలు ఉందా? అనే అంశం చర్చకు వచ్చింది. ఇందుకు వీలున్న అవకాశాలను అన్వేషించడం మొదలు పెట్టాం. కొన్ని ఐడియాలు వచ్చి, అందరికీ నచ్చాయి. భగవంతుడు కోరుకుంటే సీక్వెల్ వస్తుంది అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆయన మాటలను బట్టి 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్‌ ఓకే అయిపోయినట్లుగా తెలుస్తోంది. కాకపోతే... మళ్ళీ ఎన్టీఆర్, చరణ్ డేట్స్ అడ్జస్ట్ కావడానికి కొంత టైమ్ పట్టవచ్చని ఫిలింనగర్‌లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ .. కొరటాల శివ దర్శకత్వంలో ఒకటి, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమాల్లో నటించనున్నారు. అటు చరణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, ఆ తర్వాత 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించారు. మరోవైపు రాజమౌళి కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాల్సి వుంది. ఈ ముగ్గురూ తమ తమ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసిన తర్వాత 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ పట్టాలు ఎక్కుతుందేమో చూడాలి.

More News

మాస్ మహారాజా ఫ్యాన్స్‌కి ఉగాది ట్రీట్..  “టైగర్‌ నాగేశ్వరరావు” నుంచి ప్రీ లుక్‌

మాస్ మహారాజా రవితేజ వరుసపెట్టి సినిమాలు లైన్‌లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది ఖిలాడి మూవీని రిలీజ్ చేసిన ఆయన...

కో డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులు.. 'ఊ అంటావా' సాంగ్ కొరియోగ్రాఫర్‌పై కేసు

చెన్నైకి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య వివాదంలో చిక్కుకున్నారు. తనను లైంగిక వేధిస్తున్నాడంటూ అతడి కోడాన్సర్ ఆయనపై 2020లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

అన్నయ్య అందుకే అలా మారిపోయారు.. పరుచూరి షాకింగ్ లుక్‌‌పై గోపాలకృష్ణ రియాక్షన్

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావుతో దర్శకుడు జయంత్ సీ పరాన్జీ దిగిన ఓ ఫోటో ఇటీవల సోషల్ మీడియాలోనూ, తెలుగు చిత్ర పరిశ్రమలను హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, ఏకంగా రూ.250 పెంపు, కొత్త రేట్లు ఇవే

ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరిచింది కేంద్ర సర్కార్ . దీనిపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలకు సైతం సిద్ధమవుతున్నాయి.

టాలీవుడ్‌లో విషాదం .. క్యాన్సర్‌తో డైరెక్టర్ శరత్ కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో దర్శకుడు శంకర్ కన్నుమూశారు.