close
Choose your channels

Road Accident:ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి ఐదుగురు మృతి..

Monday, December 25, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నల్గగొండ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. పెద్దవూర మండలం నిమ్మానాయక్ తండాకు చెందిన కేశవులు(28) ఆదివారం రాత్రి మిర్యాలగూడ నుంచి పెద్దవూరకు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తున్న సైదులు అనే వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న కేశవులు కుటుంబసభ్యులు ఘటనాస్థలికి ఇవాళ తెల్లవారుజామను టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు.

అయితే మరికాసేపట్లో అక్కడికి చేరుకుంటారనగా.. ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జు కావడంతో.. కుటుంబసభ్యులు రమావత్ గన్యా (40), నాగరాజు (28), పాండ్య (40), బుజ్జి (38) స్పాట్‌లోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని పోలీసులు మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా వైద్యులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఒకేసారి రోడ్డు ప్రమాదాల్లో మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment