రాధా రంగా మిత్రమండలికి వర్మ వార్నింగ్..!

  • IndiaGlitz, [Tuesday,December 27 2016]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన వంగ‌వీటి చిత్రంలో అభ్యంత‌రక‌ర స‌న్నివేశాలు ఉన్నాయి అంటూ వంగ‌వీటి రాధా ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. డ‌బ్బు కోసం చ‌రిత్ర‌ను మార్చి సినిమాలు తీస్తే ఊరుకోమ‌ని వంగ‌వీటి రాధా వ‌ర్మ‌కు వార్నింగ్ ఇచ్చారు. రంగా అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామ‌ని తెలియ‌చేసారు. దీనిపై రామ్ గోపాల్ వ‌ర్మ స్పందిస్తూ...1 పని పాట లేకుండా మురికి వీధుల్లో తిరిగే మీ లాంటి వాళ్ళు రాధా రంగాల పేరుని చెడగొట్టటానికే పుట్టారు.
మీలాంటి కుయ్యం గాళ్ళు నా దిష్టి బొమ్మల్ని తగలబెట్టచ్చు గాని నేను మీ లోపలి కుళ్ళుని పెట్రోల్ కూడా లేకుండా తగలబెడతా. 2. ఇప్పటికైనా బుద్ధిలేని మీ బుర్రల్లోకి బుద్ది తెచ్చుకోకపోతే నా అంతు చూసే లోపల మీరే అంతమైపోతారు. 3 నేను క్షమాపణలు చెప్పటం అటుంచి మీరు మొరగడం ఆపకపోతే మీ అసలు జాతేంటో అందరికీ తెలిసిపోతుంది...ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

More News

బాలకృష్ణ 100వ సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి చేయడం మనందరి అదృష్టం - చంద్రబాబు నాయుడు

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై జాగర్ల మూడి క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

దూసుకెళుతున్న 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్'

లక్కీమీడియా బెక్కం వేణుగాపాల్ నిర్మాతగా దిల్ రాజు సమర్పణలో హెబ్బా పటేల్ ,నోయెల్ ,పార్వతీశం

ఒక్క‌డొచ్చాడు డైరెక్ట‌ర్ సూర‌జ్ పై ఫైర్ అయిన‌ తమన్నా

విశాల్, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం ఒక్కడోచ్చాడు. ఈ చిత్రాన్నిసూర‌జ్ తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ్ లో రూపొందిన ఈ చిత్రం స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. డైరెక్ట‌ర్ సూర‌జ్ హీరోయిన్స్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

భారీ రేటుకు ఖైదీ నెం 150 శాటిలైట్ రైట్స్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150.  చాలా గ్యాప్ త‌రువాత చిరు న‌టిస్తుండ‌డంతో సినిమా ప్రారంభం నుండి ఖైదీ నెం 150 పై భారీ క్రేజ్ ఏర్ప‌డింది.

తలైవా మొదలెట్టేశాడు

తలైవా రజనీకాంత్ డబ్బింగ్ మొదలుపెట్టేశారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 2.0. శంకర్ దర్శకత్వంలో రూపొందిన `రోబో` చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న చిత్రం `2.0`.