కరోనాతో పోల్చితే బిన్ లాడెన్ ఓ బచ్చా: ఆర్జీవీ

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంశంపై అయినా సరే తనదైన శైలిలో విమర్శలు, సెటైర్లు గుప్పించడంలో ఆర్జీవీ ముందు వరుసలో ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మమమ్మారిపై వరుస ట్వీట్స్ చేస్తూ.. కాస్త మంచిగానే ఉన్నాడు. మరోవైపు కరోనా పోరులో భాగంగా తన వంతుగా జనాల్లో చైతన్యం కలిపిస్తున్నాడు కూడా. అయితే.. అగ్రరాజ్యమైన అమెరికాలో మాత్రం కరోనాతో గంటకు సుమారు 100 మంది దాకా మరణిస్తున్నారు. ఈ తరుణంలో ఆర్జీవీ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు.

అదేమిటంటే.. ‘అమెరికాలో సంభవిస్తున్న మరణాలు చూస్తుంటే అక్కడ ప్రతిరోజూ 9/11 దాడులు జరుగుతున్నట్టుగా ఉంది. కరోనా మహమ్మారితో పోల్చితే ఒసామా బిన్ లాడెన్ ఓ బచ్చా . అయినా.. ఒసామా బిన్ లాడెన్ ఆత్మ పగబట్టి కరోనా వైరస్ రూపంలో అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటోందని నేను భావించడంలేదు’ అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇప్పటివరకు 6.44 లక్షల మందికి కరోనా సోకగా, 28 వేల మందికి పైగా మరణించారు.

More News

జగన్ క్యాంప్ ఆఫీస్‌లో కీలక మార్పు.. ధర్మచక్రం ఔట్!

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి తనదైన శైలిలో పరిపాలన ముద్ర వేసుకోవడానికి తహతహలాడుతున్నారు.

షాకింగ్..: ఇవాళ ఒక్కరోజే తెలంగాణలో 50 కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 50 ‘కరోనా’ పాజిటివ్ కేసులు నమోదవ్వడం షాకింగ్ గురి చేస్తోంది.

కంగనా రనౌత్ సోదరికి షాకిచ్చిన ట్విట్టర్!

అవును మీరు వింటున్నది నిజమే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ ట్విట్టర్ అకౌంట్‌ను యాజమాన్యం నిలిపివేసింది.

రామ్‌ చరణ్‌తో ఫన్నీగా మాట్లాడిన కేటీఆర్..!

అవునా ఇదేంటి.. ఈ ఇద్దరి మధ్య ఏం టాఫిక్ వచ్చిందబ్బా..? అని అనుకుంటున్నారా..? మీరు వింటున్నది నిజమే.. కానీ ఇక్కడ సినిమాలో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాదండోయ్..

బోయ‌పాటి వెన‌క‌డుగు..!!

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా