ఆర్జీవీ బయోపిక్ పార్ట్ 1 షూటింగ్ స్టార్ట్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మూడు భాగాల బయోపిక్ లో తొలి భాగం షూటింగ్ బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. హైదరాబాద్ లోని ఓ కళాశాలలో మొదలైన ఈ షూటింగ్ కు రామ్ గోపాల వర్మ తల్లి సూర్యావతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఆర్జీవీ సోదరి విజయ క్లాప్ ఇచ్చారు. ఈ మూడు భాగాల బయోపిక్ ను బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మాకు మురళి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి భాగంలో దొరసాయి తేజ టీనేజ్ రామ్ గోపాల్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ పార్ట్ 1 లో వర్మ కాలేజ్ రోజులు, తోలి ప్రేమలు, గ్యాంగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాడన్నది కథాంశంగా చూపించబోతున్నారు. మిగతా పాత్రల్లో కొత్త నటీనటులు నటిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బొమ్మాకు మురళి మాట్లాడుతూ.... రాము గారు ఒక సూపర్ హ్యూమన్. టాలీవుడ్ లో, బాలీవుడ్ లో ఆయన జర్నీ అద్భుతం. ఇప్పటికీ రాము గారు సినిమాల పట్ల చూపించే ప్యాషన్ ఆశ్చర్యపరుస్తుంది. ఆయన బయోపిక్ తీసే అవకాశం నాకు కలగడం సంతోషంగా ఉంది. రాము గారి మూడు భాగాల బయోపిక్ లో పార్ట్ 1 షూటింగ్ ఇవాళ ప్రారంభించాం. ఆర్జీవీ మాతృమూర్తి సూర్యావతి, సోదరి విజయ గారు షూటింగ్ ప్రారంభోత్సవానికి హాజరుకావడం మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. దర్శకుడు దొరసాయి తేజ రాము గారి టీనేజ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. నగరంలోని ఓ కాలేజ్ లో తొలి భాగం షూటింగ్ బుధవారం నుంచి మొదలై 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఇతర పాత్రల్లో కొత్త నటీనటులు నటిస్తున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాం. అన్నారు.

More News

బెజవాడ కనకదుర్గమ్మ రథంలోని 3 వెండి సింహాలు మాయం

ఏపీ దేవాలయాల్లో చోటు చేసుకుంటున్న వరుస ఘటన ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

బిగ్‌బాస్ హౌస్‌లో బిర్యానీని చూడనట్లు బిహేవ్ చేస్తారు: సూర్యకిరణ్

బిగ్‌బాస్ సీజన్ 4 నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన సూర్యకిరణ్ ఓ ఇంటర్వ్యూలో హౌస్ గురించి పలు ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించారు.

శ‌ర్వానంద్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్‌...?

డైరెక్ట‌ర్‌గా తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’తో సూప‌ర్‌హిట్ అందుకున్నాడు అజ‌య్ భూప‌తి. త‌ర్వాత ‘మ‌హా స‌ముద్రం’ అనే మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు. ర‌వితేజ‌, సిద్ధార్థ్ స‌హా

తండ్రి త‌ర్వాత కొడుకుతో ప‌నిచేయ‌నున్న మెగాస్టార్‌!

మెగాస్టార్ చిరంజీవి స్పీడుపెంచాడు. ప్ర‌స్తుతం `ఆచార్య` సినిమాను ఆయ‌న పూర్తి చేయాల్సి ఉంది. దీని త‌ర్వాత మ‌రో నాలుగైదు క‌థ‌ల‌తో ద‌ర్శ‌కులు సిద్ధంగా ఉన్నారు.

అనుష్క 'నిశ్శ‌బ్దం' ఓటీలో ఎప్ప‌టినుండంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు తెలుగు చిత్ర సీమ‌లో అనుష్క ఓ స‌మాధానంగా కనపడటమే కాదు.. అవకాశాలను అందిపుచ్చుకుని