Revanth Reddy: కరెంట్‌పై చర్చకు సిద్ధమా..? సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్..

  • IndiaGlitz, [Wednesday,November 15 2023]

తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లుతో కాక రేపుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల ఉచిత విద్యుత్‌పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధంగా ఉన్నామని 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు కేసీఆర్ నిరూపిస్తే తాను పోటీ చేస్తున్న కొడంగల్, కామారెడ్డిలో నామినేషన్ ఉపసంహరించుకుంటానని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు టైం ఉందని.. ఈరోపు కేసీఆర్ లాగ్ బుక్‌లు తీసుకొని కామారెడ్డికి రావాలన్నారు.

ప్రపంచం మొత్తం ప్రస్తుతం కామారెడ్డి వైపే చూస్తుందని.. కేసీఆర్‌కు బుద్ధి చెప్పడం కోసమే కామారెడ్డిలో పోటీ చేస్తున్నానని తెలిపారు. కర్ణాటకలో గెలిచినట్లు.. తెలంగాణలోనూ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు కష్టాలు పడ్డామని కేసీఆర్‌కు వడ్డీతో సహా తిరిగి చెల్లించే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ ప్రజలు కోరుతున్నారని వెల్లడించారు.

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ప్రచారం కరెంట్ చుట్టూనే తిరుగుతోంది. దీనినే ప్రధాన అంశంగా చేసుకొని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శులు చేసుకుంటున్నారు. ప్రతి సభలో కరెంటు కావాలా..? కాంగ్రెస్ కావాలా..? అంటూ బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ చీకట్లు ఖాయమంటూ చెబుతున్నారు. ఈ విమర్శలను ఎప్పటికప్పుడు కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. ఇప్పుడు ఏకంగా కరెంట్‌పై చర్చకు రావాలంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.

More News

Tamannah: త్వరలో ‘MCA’ విలన్‌తో హీరోయిన్ తమన్నా పెళ్లి..?

మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా ఓ క్రేజ్ తెచ్చుకుంది. సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోల సరసన నటించి ఆకట్టుకుంది.

Bigg Boss Telugu 7: కొడతావా కొట్టు అమర్‌ మీదకెళ్లిన యావర్, రెండో రోజూ రచ్చే.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే..?

దీపావళి సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత జరిగిన సోమవారం నామినేషన్స్ ప్రక్రియ షురూ అయ్యింది. రతిక.. శోభాశెట్టి, ప్రియాంక, అర్జున్..

Telangana Elections 2023: రెబల్స్‌ను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన ముఖ్య నేతలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేటితో కీలక ఘట్టం ముగియనుంది. ఎందుకంటే నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళే ఆఖరి రోజు. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి.

Animal: 'నాన్న నువ్వు నా ప్రాణం'.. యానిమల్ నుంచి హార్ట్ టచింగ్ సాంగ్..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్‌(Ranbir Kapoor), సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం 'యానిమల్'. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.

Nadendla Manohar: జగనన్న విద్యాకానుకలో భారీ స్కామ్‌ జరిగింది: నాదెండ్ల

జగనన్న విద్యాకానుకలో భారీ స్కామ్‌ జరిగిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.