రిపబ్లిక్ డే నాకు ఎంతో ప్రత్యేకం.. పద్మవిభూషణ్‌ వస్తుందని ఊహించలేదు: చిరు

  • IndiaGlitz, [Friday,January 26 2024]

దేశంలో రాజ్యాంగం అమలైన గణంతంత్ర దినోత్సవం తనకు ఎంతో ప్రత్యేకమని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. రిపబ్లిక్ డే రోజునే తనకు దేశంలోనే రెండు అత్యుతమైన అవార్డులు వచ్చాయన్నారు. హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రిపబ్లిక్ డే వేడుకు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో చిరంజీవితో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరో వరుణ్ తేజ్, సుష్మిత కొణిదెల, చిరంజీవి మనవరాళ్లు నవిష్క, సమరలతో పాటు అభిమానులు పాల్గొన్నారు. ఈ ఏడాది చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించటంతో ఈ వేడులు మరింత ప్రత్యేకత సంతరించుకున్నాయి. జెండా వందనం చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

‘దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మంది మహనీయుల త్యాగం వల్లే మనం ఈ రోజు ఇలా ఉండగలుగుతున్నాం.. అలాంటి త్యాగమూర్తులకు నివాళులు అర్పించుకుందాం. రిపబ్లిక్ డే నాకు చాలా ప్రత్యేకం. 45 ఏళ్ల సినీ ప్రయాణంలో నేను ఈ కళామతల్లికి సేవ చేసుకోవడం, సామాజిక బాధ్యతతో ఆయా సందర్భాల్లో కళాకారులకు సేవ చేస్తూ వచ్చాను.ఎన్నో సంవత్సరాలుగా విపత్తులు జరిగినా, అవసరార్థులకు ఆయా సమయాల్లో అండగా నిలబడ్డాను. నా వంతు సామాజిక సేవ చేసుకుంటూ వచ్చాను. అందులో భాగంగా బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశాం. బ్లడ్ బ్యాంక్ ఎంతో మందికి స్పూర్తిగా నిలిచింది. ఈ రోజు రాష్ట్రంలో రక్తం కొరత లేదు. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయానికి గర్వపడుతుంటాను. ఇది ఇంతగా సక్సెస్ అయిందంటే అభిమానులే కారణం. వారిని చూసుకునే నేను గర్వపడుతుంటాను. వారే లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం కావు. అందుకు కారణమైన నా బ్లడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కి ఎప్పుడూ రుణపడి ఉంటాను.

రిపబ్లిక్ డేకి నా సేవలను గుర్తించి 2006లో పద్మ భూషణ్ ఇచ్చారు. అదే నాకు చాలా ఎక్కువ.. ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఇక ఎప్పుడూ ఎదురుచూడని, ఊహించనటు వంటి పద్మవిభూషణ్ అవార్డును ఈ ఏడాది ఇచ్చారు. ఈ అవార్డును ప్రకటించేందుకు కారణమైన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్.. కేంద్రానికి, ప్రధానికి మోదికి ప్రత్యేక ధన్యవాదాలు. పద్మ అవార్డులు వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు. జై హింద్’ అని తన ప్రసంగం ముగించారు.

ఇదిలా ఉంటే సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొందరు నేరుగా కలిసి విషెస్ చెబితే.. మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రాజమౌళి, వరుణ్ తేజ్, రాఘవేంద్రరావు, నారా రోహిత్, రాధికా, డైరెక్టర్ మారుతి, ప్రశాంత్ వర్మ, సాయి ధరమ్ తేజ.. ఇలా ఎంతో మంది పద్మవిభూషుణుడికి అభినందనలు తెలియజేస్తున్నారు.

More News

చంద్రబాబుపై పవన్ వ్యాఖ్యల మర్మం ఏంటి..? టీడీపీకి బైబై చెబుతారా..?

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల మండపేట, అరుకు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

రెండు సీట్లను ప్రకటించిన జనసేన.. చంద్రబాబుపై పవన్ కీలక వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పోటీ చేసే రెండు అసెంబ్లీ స్థానాలను ప్రకటించారు. రాజోలు, రాజానగరంలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని వెల్లడించారు.

జగన్ నియంతలా మారారు.. వైయస్ షర్మిల ఘాటు విమర్శలు..

తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల(YS Sharmila) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన

చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు.. మెగాస్టార్ ప్రస్థానం ఇదే!

మెగాస్టార్ చిరంజీవి.. నటుడు, రాజకీయ నాయకుడు, సమాజ సేవకుడు, వ్యాపారవేత్త. ఇలా అడుగుపెట్టిన ప్రతి రంగంలో తనకంటూ ఓ ముద్ర వేశారు. అందుకే మరో అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు.

అన్నయ్యకు పద్మవిభూషణ్ రావడం సంతోషంగా ఉంది: పవన్ కల్యాణ్

తెలుగు తేజాలు మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సంతోషం వ్యక్తం చేశారు.