రేణుదేశాయ్ తప్పుకున్నారా?

  • IndiaGlitz, [Saturday,August 03 2019]

నటి రేణుదేశాయ్, పవన్ కల్యాణ్ నుండి విడిపోయిన తర్వాత దర్శకురాలిగా నిలదొక్కుకొనే ప్రయత్నం చేశారు కానీ.. సక్సెస్ సాధించలేకపోయారు. అయితే కొన్నాళ్ల క్రితం ఈమె నటిగా తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపించాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'దొంగాట' ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.

1980 సమయంలో రాబిన్ హుడ్‌గా పేరు సంపాదించుకున్న టైగర్ నాగేశ్వరరావు జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో కీలకమైన సామాజిక కార్యకర్త పాత్రలో రేణుదేశాయ్ నటిస్తారని అన్నారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుండి రేణుదేశాయ్ తప్పుకున్నారని, అందుకు కారణాలు తెలియడం లేదని అంటున్నారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.