అప్పుడు రీమేక్‌.. ఇప్పుడు రీమిక్స్‌

  • IndiaGlitz, [Sunday,April 15 2018]

యువ కథానాయకుడు నాగ చైతన్య కథానాయకుడిగా, చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. స్వ‌ర‌వాణి కీరవాణి స్వరాలను అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం కోసం గ‌తంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘అల్లరి అల్లుడు’ (1993) సినిమాలోని “నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు” అనే పాటను రీమిక్స్ చేస్తున్న సంగ‌తి  తెలిసిందే. అప్పట్లో ఆ పాటలో నాగ్ సరసన రమ్యకృష్ణ వెండితెరపై సందడి చేయగా.. ఇప్పుడు ఈ రీమిక్స్ సాంగ్‌లో చైతుతో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ ఆడిపాడనుందని సమాచారం.

ఇంత‌కుముందు చైతు హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘ప్రేమమ్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మలయాళం మూవీ ‘ప్రేమమ్’కి రీమేక్‌గా ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు. చైతుతో కలిసి చందు మొండేటి  చేసిన తొలి సినిమా రీమేక్ చిత్రమైతే.. మలి చిత్రంలో పాటను రీమిక్స్ చేస్తుండ‌డం విశేషం. మరి గత రీమేక్ చిత్రంలాగే.. ఈ రీమిక్స్ ఉన్న‌ చిత్రం కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి.

More News

ఈ సారైనా విజ‌యం ద‌క్కేనా?

యూత్‌ఫుల్ చిత్రాల దర్శకుడు ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో మెగాహీరో సాయిధరమ్ తేజ్, కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘తేజ్‌ ది కూడా ఓ మంచి ప్రేమ కథ’ (ప్రచారంలో ఉన్న పేరు).

'సైరా నరసింహా రెడ్డి' కోసం రెండోసారి..

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’.

పూరి జగన్నాథ్‌ కెరీర్‌లో 'మెహబూబా' వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ అవుతుంది - నిర్మాత దిల్‌ రాజు

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌

'మహానటి' టీజర్ మరియు కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ విడుదల

తెలుగు చలన చిత్ర చరిత్రలో సావిత్రి గారి స్థానం అమరం.

కింగ్‌ నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్‌

కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ భారీ మల్టీస్టారర్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.