OTT:ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేస్తున్న సినిమాలు ఇవే..

  • IndiaGlitz, [Friday,February 09 2024]

ఈ వారం సినీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ దొరకనుంది. అటు థియేటర్లలో అరడజను సినిమాలు రిలీజ్ కాగా.. ఇటు ఓటీటీల్లోనూ సినిమాలు సందడి చేస్తున్నాయి. యాత్ర-2, ఈగల్, లాల్ సలామ్, ట్రూ లవర్ వంటి సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఇక ఓటీటీలో గుంటూరు కారం, కెప్టెన్ మిల్లర్ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.

గుంటూరు కారం: మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం అర్థరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయినా కానీ రూ.250కోట్లకు పైగా వసూలు చేసింది.

కెప్టెన్ మిల్లర్: తమిళ స్టార్ హీరో ధనుష్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, తెలుగు హీరో సందీప్ కిషన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తెలుగులో మాత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.

అయలాన్: తమిళ హీరో శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఏలియన్ కథాంశం వచ్చిన సైఫై కామెడీ సినిమా ‘అయలాన్’.. సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. అయితే కేవలం తమిళలో మాత్రమే అందుబాటులో ఉంది.

బబుల్‌గమ్: యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘బబుల్‌గమ్’. దర్శకుడు రవికాంత్ పేరెపు తెరకెక్కించిన ఈ చిత్రం యూత్‌ని ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

రెబల్స్‌ ఆఫ్‌ తుపాకుల గూడెం: ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది.

ది మార్వెల్స్: మర్వెల్ హీరో యూనివర్స్ నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చిన మరో సినిమా ‘ది మార్వెల్స్’. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.

ది నన్ 2, ది ఎక్సర్సిస్ట్ బిలీవర్: ఈ రెండు హాలీవుడ్ సినిమాలు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో జీ5లో అందుబాటులో ఉన్నాయి.

More News

PV Narasimha Rao:తెలుగుతేజం పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది.

Congress vs BRS:కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. వాడివేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యావాద తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్,

గ్రేటర్‌లో బీఆర్ఎస్‌ పార్టీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ డిప్యూటీ మేయర్..

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, స్టేషన్‌ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

YS Sharmila: ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిలకు భద్రత పెంచిన పోలీసులు

ఎట్టకేలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు పోలీసులు భద్రతను పెంచారు. ఈ విషయాన్ని కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. షర్మిల అభ్యర్థన మేరకు ఆమె భద్రతను వన్ ప్లస్ వన్ నుంచి

Mahender Reddy :కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.