రెజీనా క‌సాండ్ర తాజా చిత్రం ‘నేనే నా’ షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Wednesday,August 18 2021]

హీరోయిన్ రెజీనా కసాండ్ర లేటెస్ట్ మూవీ ‘నేనే నా’. ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ సినీ ఇండ‌స్ట్రీ స‌హా ప్రేక్ష‌కులంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేస్తూ అభిమానుల‌ను సంపాదించుకున్న రెజీనా తాజా చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. కార్తీక్ రాజు ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ ద్విభాషా చిత్రం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా...

డైరెక్ట‌ర్ కార్తీక్ రాజు మాట్లాడుతూ ‘‘నేనే నా’ సినిమా షూటింగ్ సజావుగా సాగిందని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాం. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సూప‌ర్ విజువ‌ల్స్‌, మిస్ట‌రీ క‌థాంశంతో ర‌న్ అయ్యే ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఓ స‌రికొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు.

ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందించారు. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రాజ్ శేఖ‌ర్ వ‌ర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. కుట్రాలం ప‌రిస‌ర ప్రాంతాల్లో సినిమా మేజ‌ర్ పార్ట్‌ను చిత్రీక‌రించాం. ప్ర‌తి చిత్రంలో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటున్న రెజీనా క‌సాండ్ర ఈ చిత్రంలో ఆర్కియాల‌జిస్ట్‌గా పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. శామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రాఫ‌ర్‌. సాబు ఎడిట‌ర్‌. సూప‌ర్ సుబ్బ‌రాయ‌న్ స్టంట్ మాస్ట‌ర్‌.

రెజీనా క‌సాండ్ర ప్ర‌ధాన పాత్ర పోషించిన‌ ఈ చిత్రంల‌ వెన్నెల కిషోర్‌, అక్ష‌ర గౌడ‌, తాగుబోతు ర‌మేశ్‌, జ‌య‌ప్ర‌కాశ్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌లను పోషించారు.

న‌టీన‌టులు: రెజీనా క‌సాండ్ర‌, వెన్నెల కిషోర్‌, తాగుబోతు ర‌మేశ్‌, జ‌య‌ప్రకాశ్‌, అక్ష‌ర గౌడ త‌దిత‌రులు

More News

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్ ల 'డియర్ మేఘ' థియేటర్ రిలీజ్ కు రెడీ

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్ ల ''డియర్ మేఘ'' సెప్టెంబర్ 3న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతోంది.

'లవ్ స్టోరి' సెప్టెంబర్ 10న థియేటర్ విడుదల

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా "లవ్ స్టోరి".

'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' లో 'పంచమి' గా నిధి అగర్వాల్

పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్‌ 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'.‘నిధి అగర్వాల్‘ నాయిక.

'సకల గుణాభిరామ' ఫస్ట్ లుక్ లాంచ్

E.I.P.L పతాకంపై వి.జే సన్నీ,,శ్రీ తేజ్, ఆషిమా నర్వాల్, తరుణీ, నటీనటులు గా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో

‘క్రేజీ అంకుల్స్‌’.. ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేసే స‌ర‌దా పాత్ర‌లో మెప్పిస్తాను:  సింగ‌ర్ మ‌నో

యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’.