రెజీనా బాలీవుడ్ ఎంట్రీ

  • IndiaGlitz, [Tuesday,February 20 2018]

ద‌క్షిణాది హీరోయిన్‌లు బాలీవుడ్‌లో కూడా పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్స్ చాలా మంది అటువంటి ప్ర‌య‌త్నాలు చేసిన‌వారే మ‌రి. రెండేళ్ల క్రితం రెజీనా క‌సండ్ర కూడా బాలీవుడ్‌లో 'అంఖే 2' సినిమాతో ఎంట్రీ ఇవ్వాల‌నుకుంది. అవ‌కాశం వ‌చ్చింది కూడా.. అయితే ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు రెజీనా నిరీక్ష‌ణ ఫ‌లించింది.

విదు వినోద్ చోప్రా సోద‌రి షెల్లీ చోప్రా ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న 'ఏక్ ల‌డ్‌కీకో దేఖాతో ఐసా ల‌గా' సినిమాలో రెజీనా కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంది. ఈ సినిమాలో వెస్ట్ర‌న్ లుక్ క‌న‌ప‌డే ద‌క్షిణాది అమ్మాయిగా రెజీనా న‌టించ‌బోతుంది మ‌రి. రెజీనాతో పాటు ఈ చిత్రంలో సోన‌మ్ క‌పూర్‌, రాజ్‌కుమార్‌, అనిల్ క‌పూర్‌, జూహీ చావ్లాలు నటిస్తున్నారు.

More News

బీ అల‌ర్ట్ అంటున్న టాలీవుడ్ స్టార్స్‌...

టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా.. మోసాలు చేసే వారు కూడా అంతే తెలివిగా మోసం చేసేస్తున్నారు. ముఖ్యంగా సైబ‌ర్ క్రైమ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటువంటి నేరాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించ‌డానికి హైద‌రాబాద్ సైబ‌ర్ పోలీసు శాఖ సినీ సెల‌బ్రిటీల స‌హాయం తీసుకున్నారు.

అజిత్‌, అర్జున్‌.. మ‌రోసారి

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, పంపిణీదారుడిగా.. ఇలా సినిమాకి సంబంధించిన ప‌లు విభాగాల్లో తనదైన ముద్ర వేసారు యాక్షన్ కింగ్ అర్జున్. కన్నడ కుటుంబంలో పుట్టి.. తమిళ సినిమాలతో పాపుల‌రైన అర్జున్‌.. తెలుగులో కూడా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో సంద‌డి చేశారు.

రంగమ్మ పాత్రలో అనసూయ?

లవ్ స్టోరీలను డీల్ చేయడంలో దర్శకుడు సుకుమార్ సిద్ధహస్తులు.'వన్ సైడ్ లవ్' అంటూ 'ఆర్య'సినిమాలో..

ఆ పుకార్లకి తెరదించిన సురేందర్ రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'.

అమెరికా పయనమైన 'గూఢాచారి'

​గత రెండు చిత్రాలు 'క్షణం' (2016), 'అమీ తుమీ' (2017)తో విజయాల‌ను సొంతం చేసుకున్నారు యంగ్ హీరో అడివి శేష్‌. ప్రస్తుతం శశికిరణ్ డైరెక్షన్‌లో 'గూఢాచారి' సినిమాలో నటిస్తున్నారాయ‌న‌. శోభితా ధూళిపాళ్ళ కథానాయికగా నటిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌ను అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.