మే-03 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు వెనుక 3 కారణాలు..!

యావత్ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే-03 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. అంటే మరో 19 రోజుల పాటు లాక్‌డౌన్ ఉండనుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కరోనాపై పోరాటానికి మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనాపై భారత యుద్ధం బలంగా సాగుతోందన్నారు. కష్టమైనా.. నష్టమైనా దేశం కోసం ప్రజలు నిలబడ్డారని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. అయితే.. అసలు మే-03 వరకు ఎందుకు పొడిగించినట్లు..? ఏప్రిల్-30వరకు కాకుండా మే-03వరకే ఎందుకు పొడిగించారు..? దీనివెనుక అసలు కారణాలేంటి..? అనేదానిపై ప్రస్తుతం యావత్ దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ముందు చూపుతోనే ఇలా..!

ఇదిలా ఉంంటే.. వాస్తవానికి ఏప్రిల్-30వరకే అనుకున్నప్పటికీ మే-03 వరకు లాక్‌డౌన్ పొడిగించటం వెనుక మూడు కారణాలున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే చూపుతోనే మోదీ వ్యవహరించారని చెప్పుకోవచ్చు. మే-01న కార్మికుల దినోత్సవం దీంతో ఆ రోజు హాలీడే. ఆ తర్వాత మే-02న శనివారం, మే-03న ఆదివారం ఈ రెండు రోజులు వారాంతపు సెలవులే. సో.. కార్మికుల దినోత్సవం రోజున జనాలు గుమిగూడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారాంతం కావడంతో కూడా సెలవులు వచ్చాయని జనాలు రోడ్ల మీదికొచ్చే అవకాశాలు ఉన్నాయి. జనాలు ఎక్కువగా గుమిగూడితే కరోనా సోకే ప్రమాదం మెండుగా ఉంది. అందుకే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మోదీ మే-03వరకు ప్రకటించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ముందున్నాం..!

కాగా.. దేశం కోసం తమ కర్తవ్యాన్ని సంపూర్ణంగా నిర్వహిస్తున్నారన్నారని ప్రధాని మెచ్చుకున్నారు. కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని.. ఇతర దేశాలతో పోల్చితే మన దేశం కరోనా కట్టడిలో ముందుందన్నారు. 21 రోజుల లాక్‌డౌన్‌ను దేశం సమర్థంగా అమలు చేసిందని మెచ్చుకున్నారు. ఇతర దేశాల్లో మన కంటే 20, 30 శాతం ఎక్కువ కేసులు ఉన్నాయన్నారు.

More News

ఏప్రిల్-20 తర్వాత సడలింపులు.. ఒక్క కేసు పెరిగినా..: మోదీ

ఏప్రిల్- 20వరకూ కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తామని.. ఆ తర్వాత కరోనా హాట్ స్పాట్‌లు లేని ప్రాంతాల్లో సడలింపులు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

కరోనా కట్టడికి ఈ ఏడు సూత్రాలు పాటించండి: మోదీ

కరోనాపై ‘సప్తపది’తో విజయం సాధించవచ్చునని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసగించిన మోదీ.. దేశ వ్యాప్తంగా మే-03 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని కీలక ప్రకటన చేశారు.

బాలీవుడ్ స్టార్‌పై క‌న్నేసిన త్రివిక్ర‌మ్‌

అర‌వింద స‌మేత త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, ఎన్టీఆర్ట్స్ ప‌తాకాల‌పై

నిర్మాతగా కొరటాల శివ.. తొలి అవకాశం ఎవరికంటే?

ఇప్పుడు నటీన‌టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రూ నిర్మాణంలోకి అడుగు పెడుతున్నారు. అందులో భాగంగా ప‌రిమిత‌మైన బ‌డ్జెట్‌లో సినిమాలు చేయ‌డ‌మే కాకుండా కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డం,

బిగ్ బ్రేకింగ్: మే-3 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

యావత్ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే-03 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. అంటే మరో 19 రోజుల పాటు లాక్‌డౌన్ ఉండనుంది.