తెలంగాణ మంత్రివర్గ సమావేశం రద్దు.. ఎందుకంటే..?

  • IndiaGlitz, [Saturday,May 18 2024]

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం షాక్ ఇచ్చింది. మంత్రివర్గ సమావేశానికి అనుమతి నిరాకరించింది. గ‌త రెండు రోజుల క్రితం కేబినెట్ మీటింగ్ ఉంటుందంటూ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత‌న కేబినెట్ స‌మావేశం జ‌రుగుతుంద‌ని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం అజెండాను కూడా సిద్ధం చేసింది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో భేటీ నిర్వహణ కోసం ఈసీ అనుమతి కోరింది.

కానీ లోక్‌స‌భ ఎన్నిక‌ల కోడ్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్రక్రియ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో అనుమ‌తి ఇవ్వలేదు. మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను ప్రభావితం చేసే అవ‌కాశం ఉందంటూ పేర్కొంది. ఈ నెల 27న ఖ‌మ్మం-వ‌రంగ‌ల్-న‌ల్లగొండ ప‌ట్టభ‌ద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అలాగే జూన్ 4న లోక్‌స‌భ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు అనంత‌రం ఎన్నిక‌ల కోడ్ ముగియ‌నుంది. అప్పటిదాకా మంత్రివర్గం సమావేశం నిర్వహించవొద్దని తేల్చిచెప్పింది.

కాగా ఈ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ, ఏపీ మధ్య కొనసాగుతున్న విభజన అంశాలు, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల కేటాయింపు తదితర అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. జూన్ 2వ తేదీతో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేవలం తెలంగాణ రాజధానిగా మారనుంది. దీంతో హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ అధికారులను ఆదేశించారు. షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీపై చర్చించాలని భావించారు.

ఈ పదేళ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను రాష్ట్ర అధీనంలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. పునర్విభజన చట్ట ప్రకారం పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదికను తయారు చేయాలని సూచించారు. వీటిపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. వీటితో పాటు రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించాలని సిద్ధమయ్యారు. అయితే ఈసీ అనుమతి నిరాకరించడంతో సమావేశం వాయిదాపడింది. ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ భేటీ నిర్వహించి ఈ అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

More News

Petrol in Bottles: బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలు నిషేధం.. ఈసీ కీలక ఆదేశాలు..

ఏపీలో ఎన్నికల పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరగకుండా నిషేధం విధించింది.

Hyderabad Metro:మెట్రో టైమింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. అధికారులు క్లారిటీ..

ప్రయాణికుల రద్దీ కారణంగా హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు ఖండించారు.

Chiru, Bunny:ఒకే వేదికపై చిరు, బన్నీ, ప్రభాస్.. టీజీ సీఎం రేవంత్ రెడ్డి కూడా..!

తెలుగు సినీ ప్రేక్షకుల‌కు శుభవార్త. ద‌ర్శక దిగ్గజం దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్(TFDA)

Renu Desai: పవన్ కల్యాణ్‌కు నాలాగా ప్రేమ లేదు.. ఫ్యాన్స్‌పై రేణుదేశాయ్ ఆగ్రహం..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌, మాజీ హీరోయిన్ రేణు దేశాయ్‌తో విడాకులు తీసుకుని సంవత్సరాలు గడుస్తున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎవరి జీవితం వాళ్లు లీడ్ చేస్తున్నారు.

Sharmila: దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా సుప్రీంకోర్టు తీర్పు: షర్మిల

ఏపీలో పోలింగ్ ముగిసే దాకా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా ఫుల్ యాక్టివ్‌గా ఉండేవారు. ఆమె చేసే ప్రతి ప్రచారం కార్యక్రమం వివరాలతో పాటు వైసీపీ ప్రభుత్వ పాలనపై