అందుకే..పూరి గోల్కండ‌లో ప్లాన్ చేసాడా

  • IndiaGlitz, [Monday,August 01 2016]

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం కోసం ప్ర‌స్తుతం గోల్కండ కోట‌లో క్లైమాక్స్ సీన్స్ ను చిత్రీక‌రిస్తున్నారు. అయితే...పూరి గోల్కండ కోట‌లో షూటింగ్ చేయ‌డం వెన‌క ఓ ప్ర‌త్యేక కార‌ణం ఉంద‌ట‌.

అది ఏమిటంటే...మ‌హేష్ బాబు - పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన పోకిరి చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఈ సంచ‌ల‌న చిత్రం పోకిరి ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ ను గోల్కండ కోట‌లోనే చిత్రీక‌రించారు. అందుచేత సెంటిమెంట్ గా భావించి పోకిరి రేంజ్ సెన్సేష‌న్ క్రియేట్ చేయాల‌నే ఇజం క్లైమాక్స్ సీన్స్ ను గోల్కండ కోట‌లో చిత్రీక‌రిస్తున్నార‌ట‌. ఈ నెల మొద‌టివారంలో స్పెయిన్ లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 29న ఇజం చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి...సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయి ఇజం సంచ‌ల‌న విజ‌యం సాధిస్తుందని ఆశిద్దాం.

More News

వాళ్లు దొంగ‌నాకొడుకులు అంటూ ఫైరైన రానా..

విజ‌య్ దేవ‌ర‌కొండ - రీతువ‌ర్మ జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం పెళ్లిచూపులు. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కందుకూరి నిర్మించిన పెళ్లిచూపులు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బడుతోంది.

కేర‌ళ‌లో యంగ్ టైగ‌ర్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది.

బాలీవుడ్ రీమేక్‌లో శ్రీముఖి...

టీవీ యాంక‌ర్, సినిమా న‌టి అయిన శ్రీముఖి ఇప్పుడు వ‌రుస అవకాశాల‌ను అందిపుచ్చుకుంటుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇప్పుడు బాలీవుడ్ మూవీ హంట‌ర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

మ‌హేష్ మూవీ ఓకే అయ్యాకా ర‌కుల్ ఏం చేసిందో తెలుసా..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇటీవ‌ల ప్రారంభ‌మైంది. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అందుకే...క‌మ‌ల్ కి ర‌జ‌నీ ఫోన్ చేశార‌ట‌..!

యూనీవ‌ర్శిల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ గ‌త నెల 13న ఇంట్లో మెట్ల పై నుంచి జారీప‌డిన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత చెన్నైలోని హాస్ప‌ట‌ల్ లో చేరిన క‌మ‌ల్ కు వైద్యులు ఆప‌రేషన్ చేసారు. మూడు వారాల త‌ర్వాత డిశ్చార్జి చేస్తామ‌ని చెప్పారు.