చిరంజీవి రాకపోవడానికి రీజన్ అదేనట...

  • IndiaGlitz, [Tuesday,December 08 2015]

మెగాస్టార్ చిరంజీవి వార‌సులుగా ఇప్పుడు ఆర‌డజ‌ను మంది హీరోలు తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్నారు. రీసెంట్‌గా ముకుంద‌, కంచె చిత్రాల‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన వ‌రుణ్‌తేజ్ కూడా అందులో ఒక‌డు. సాధార‌ణంగా ప్ర‌తి ఆడియో వేడుక‌కు చిరంజీవిని ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తుంటారు. వ‌రుణ్ రీసెంట్ మూవీ కంచెకు కూడా చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యాడు. కానీ నిన్న జ‌రిగిన లోఫ‌ర్‌కు చిరు హాజరు కాలేదు.

చిరంజీవితో ద‌ర్శ‌కుడు పూరికి చిన్న‌పాటి గ్యాప్ వ‌చ్చింద‌ని అందుకే చిరంజీవిని పిల‌వ‌లేద‌ని కూడా వార్త‌లు వినిపించాయి. ప్ర‌భాస్ ముఖ్యఅతిథిగా వ‌చ్చాడు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో మేం చిన్న సైజ్ క్రికెట్ టీంలా త‌యార‌య్యాం. ప‌త్రి వేడుక‌కు చిరంజీవిగారు రావడం మంచిదే అయినా ప్ర‌తి నెల ఎవ‌రిదో ఒక‌రి ఆడియో ఫంక్ష‌న్ జ‌రుగుతుంది. ప్ర‌తి వేడుక‌కు ఎందుకు రావ‌డం అనుకోవ‌డంతో లోఫ‌ర్ ఆడియో వేడుక‌కు చిరంజీవి రాలేద‌ని వ‌రుణ్ వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు.