అజయ్ భూపతి 'మహాసముద్రం' ఆలస్యానికి కారణమిదేనా?

'ఆర్ఎక్స్ 100' సినిమాలో లవ్, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉంటాయి. అందుకే, అన్ని వర్గాల జనం ఆదరించారు. ముఖ్యంగా, యూత్ తెగ మెచ్చుకున్నారు దర్శకుడ్ని. అయినా అజయ్ భూపతి రెండేళ్లుగా ఖాళీగానే ఉండిపోయాడు. కారణం, ఆయన నెక్ట్స్ సెట్స్ మీదకి తీసుకెళ్లాలనుకుంటోన్న సినిమా ఒకింత సాహసం చేయాల్సిన సబెక్ట్ కావటమే! ఇప్పటికే 'మహాసముద్రం'గా ప్రచారం అవుతోన్న అజయ్ భూపతి నెక్ట్స్ ప్రాజెక్ట్ చాలా మంది హీరోల దగ్గరికి వెళ్లి వచ్చింది. చివరగా, ఇప్పుడు శర్వానంద్ చేయ‌డానికి ఒకే అన్న‌ట్లు వార్త‌లు వినిపించాయి.

'జాను' సినిమాతో జనం ముందుకొస్తోన్న శర్వానంద్ విభిన్నమైన సినిమాలకు ఎప్పుడూ రెడీనే. కాకపోతే, 'మహాసముద్రం' కూడా రొటీన్ కి భిన్నమైన స్టోరీయే అయినా... బడ్జెట్ విషయంలో ఇప్పుడు ట్విస్ట్ వచ్చి పడిందట. అజయ్ భూపతి తన స్క్రిప్ట్ సినిమాగా మారటానికి 25 నుంచి 30 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నాడని సమాచారం. దీనికి భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండటం ఒక కారణం. అలానే ఇందులో శర్వానంద్ తో పాటు మరో హీరో కూడా ఉంటాడట. అతనెవరో ఇంకా తేలలేదట. మరి ఇద్దరు హీరోలు అన్నాక డబుల్ రెమ్యూనరేషన్ కదా! పైగా ఓ స్టార్ హీరోయిన్ అనుకుంటున్నారట. ఆమె రేటుతో కలుపుకుంటే 'మహాసముద్రం' బడ్జెట్ బోలెడంత అవుతుంది. మరి అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే లాభాలు వస్తాయా? ఈ ప్రశ్నతోనే మూవీ లేట్ అవుతోందని టాక్.

త్వరలో శర్వానంద్ 'జాను' విడుదలై హిట్ అయితే అజయ్ భూపతి 'మహాసముద్రం' కూడా ఊపందుకునే అవకాశాలున్నాయి. అలాగే, ఈ సినిమాలో రెండో హీరో ఎవరో తెలిస్తే కూడా బడ్జెట్ పెట్టటానికి నిర్మాతలు ముందుకు రావచ్చు. చూడాలి మరి, 'మహాసముద్రం' ఇంకెన్నాళ్లకు సెట్స్ మీదకు వెళుతుందో చూడాలి.

More News

అలీకి గుడ్ న్యూస్.. పవన్ నుంచి పిలుపు..!?

అవును మీరు వింటున్నది నిజమే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి కమెడియన్ కమ్ వైసీపీ నేత అలీకి పిలుపు పోయిందట.

RIP అంటూ హీరోయిన్‌పై శ్రీరెడ్డి సంచలన పోస్ట్!

టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి మరోసారి వార్తల్లో నిలిచింది. నిత్యం వివాదాలే ఊపిరిగా బతుకుతున్న శ్రీరెడ్డి ఎవర్ని పడితే వార్ని గోకుతూ హడావుడి చేస్తుంటుంది.

కాజ‌ల్ కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తుంద‌ట‌...!

టాలీవుడ్‌లో 12 ఏళ్ల క్రితం `ల‌క్ష్మీక‌ళ్యాణం` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి అనారోగ్యం పాలయ్యారు. ఆదివారం రాత్రి అస్వస్థతకు గురవ్వడంతో హుటాహుటిన ఆమె ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రికి తరలించారు.

భీమవరం అమ్మాయిని పెళ్లాడబోతున్న నిఖిల్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. భీమవరం అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. డాక్టర్ పల్లవితో కలిసి నిఖిల్ ఏడు అడుగులు వేయబోతున్నాడు.