‘కమ్మవారు తలచుకుంటే జగన్ లేచిపోతాడు..!’

  • IndiaGlitz, [Wednesday,April 15 2020]

కరోనా నేపథ్యంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతల నోళ్లకు మూత పడట్లేదు. కరోనాను ఎదుర్కొనేందుకు ఏమేం చేయాలి..? ఎలా ముందుకెళ్లాలి..? అని ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయాల్సిందిపోయి.. ప్రతిపక్షాలు అనవసరం నోరు పారేసుకుంటున్నాయి. బుధవారం నాడు టీడీపీ మాజీ ఎంపీ, వ్యాపారవేత్త రాయపాటి సాంబశివరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా పెద్ద పెద్ద పోస్టింగ్స్‌ ఉండేవారు ‘కమ్మ’ అని తెలిస్తే తీసి పక్కన పడేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి పద్ధతులు మంచివి కాదని జగన్ మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రెడ్డి కులం వారికే పోస్టింగ్స్ ఇస్తోందని రాయపాటి ఆరోపించారు.

జగన్ లేచిపోతాడు..!

అంతటితో ఆగని ఆయన.. కమ్మ వారు ఏం చేస్తారులే అనుకోవద్దని.. కమ్మవారు తలుచుకుంటే జగన్ లేచిపోతాడని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ పరిపాలన గుడ్డి ఎద్దు చేలో పడ్డట్లుగా ఉందని విమర్శలు గుప్పించారు. జగన్.. ప్రతి విషయంలోనూ కమ్మ , కమ్మ అంటూ గోల చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ‘జగన్ కనీకం మంత్రులకు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను మార్చడం మంచిది కాదు. ఎన్నికలు వాయిదా వేయకపోతే వేల మంది చనిపోయేవారు. కరోనాను సీఎం జగన్ చాలా ఈజీగా తీసుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫానే క్వారంటైన్‌లో ఉన్నాడు. కరోనా తగ్గిన తర్వాత అమరావతి విషయంపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతాను. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని మారిస్తే మాత్రం వైసీపీ కచ్చితంగా జీరో అవుతుంది. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ ఓటమి ఖాయం’ అని రాయపాటి జోస్యం చెప్పారు. సాంబశివరావు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

More News

ఆంగ్ల మాధ్యమం: జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాజకీయాలు అస్సలు ఆగట్లేదు. అధికార పార్టీ మాత్రం దీన్నే అలుసుగా చేసుకుని చేయాల్సినవన్నీ చేసేద్దామని భావిస్తుంటే..

మే-03 వరకు ఇవన్నీ పాటించాల్సిందే.. కేంద్రం హెచ్చరిక

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో మే-03 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసిన విషయం విదితమే.

మూడోసారి అదే మ్యూజిక్ డైరెక్టర్‌తో నాని

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. త‌న 25వ సినిమా `వి` ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా ప్ర‌భావంతో విడుద‌ల కాలేదు.

రీమేక్‌లో ర‌వితేజ‌?

ఈ మ‌ధ్య ర‌వితేజ జ‌యాప‌జ‌యాల‌కు సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌కు ఓకే చెప్పేస్తున్నాడు. వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు. ఇప్పుడు ర‌వితేజ హీరోగా గోపీచంద్

బన్నీ హీరోయిన్ పరిస్థితేంటి..? ఇలా త‌యారైంది

నానితో మ‌జ్ను సినిమాలో జ‌త క‌ట్టిన మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్ ప్రారంభంలో మంచి అవ‌కాశాల‌నే అందిపుచ్చుకుంది.